Monday, 9 January 2017

సరస్వతి మొక్క ఇంట్లో ఉంటే…ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారట!

   సరస్వతి మొక్క ఇంట్లో ఉంటే…ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారట!?

            ఈ భూమిపై ఎన్నో ర‌కాల వృక్ష జాతులు ఉన్నాయి. కొన్ని మొక్కల ద‌శ‌లోనే ఉంటే, కొన్ని మాత్రం మ‌హా వృక్షాలుగా భారీగా ఎదుగుతాయి. అయితే ఆయుర్వేదం ప్ర‌కారం ఈ భూ ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి ఒక్క మొక్క ఏదో ఒక ఔష‌ధ గుణాన్ని క‌లిగి ఉంటుంది. కొన్ని మొక్క‌లు, వృక్షాలు అనేక ఔష‌ధ గుణాలను క‌లిగి ఉంటాయి.

         మ‌నం ఇప్పుడు వాడుతున్న చాలా వ‌ర‌కు ఇంగ్లిష్ మెడిసిన్స్‌ను మొక్క‌లు, చెట్ల‌కు చెందిన ఆకులు, పండ్లు, వేర్ల నుంచే త‌యారు చేస్తారు.అయితే ముందు చెప్పినట్టుగా అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల విష‌యానికి వస్తే అలాంటి వాటిలో స‌రస్వ‌తి మొక్క కూడా ఒక‌టి. దీన్నే బ్ర‌హ్మ‌ణి, బ్రాహ్మి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ క్ర‌మంలో ఈ మొక్క ద్వారా కలిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరస్వతి మొక్క
1. పేరుకు త‌గిన‌ట్టుగానే స‌ర‌స్వ‌తి మొక్క ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌ర‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. నిత్యం 4 స‌ర‌స్వ‌తి ఆకుల‌ను అలాగే నమిలి తింటుంటే మేథ‌స్సు పెరుగుతుంది. మాన‌సిక ఒత్తిడి కూడా త‌గ్గుతుంది.


2. పాఠ‌శాల‌కు, క‌ళాశాల‌ల‌కు వెళ్లి చ‌దువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకుల‌ను బాగా న‌లిపి ర‌సం తీసి దాన్ని పాల‌లో క‌లుపుకుని నిత్యం తాగితే వారి జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. చ‌దువు బాగా వ‌స్తుంది.

3. ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారికి ఈ మొక్క ఆకుల నుంచి తీసిన ర‌సాన్ని నిత్యం తాగిస్తుంటే వెంట‌నే కోలుకుంటారు.

4. స‌ర‌స్వ‌తి ఆకుల ర‌సాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్షు పెరుగుతుంది.

5. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన ర‌సం రక్తాన్ని శుభ్ర ప‌రుస్తుంది.

6. కొంత వామును తీసుకుని పొడి చేసి దాంట్లో స‌ర‌స్వతి మొక్క ఆకుల ర‌సాన్ని క‌లిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది.

7. ఈ మొక్క‌ల ఆకుల‌ను మ‌జ్జిగ‌లో 3 రోజులు నాన‌బెట్టి ఎండించి పొడి చేయాలి. దీన్ని రోజూ టానిక్‌లాగా పిల్ల‌ల‌కు ఇవ్వాలి. దీంతో వారికి బ‌లం బాగా చేకూరుతుంది.

8. స‌ర‌స్వ‌తి మొక్క ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి దాంతో తేనెను క‌లిపి తీసుకుంటే గొంతు బొంగురు త‌గ్గుతుంది. స్వ‌ర‌పేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వ‌రం కూడా క‌లుగుతుంది.

9. సరస్వతీ ఆకులను నీడలో ఎండబెట్టాలి. అయిదు బాదంపప్పులు, రెండు మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి, తగినంత తేనె కలిపి 40 రోజులపాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంది.

10. పైన చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌కే కాదు స‌ర‌స్వ‌తి మొక్క ఇత‌ర ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని పెంచ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల అరిష్టాలు పోతాయ‌ట‌. అంతేకాదు ఈ మొక్క‌ను పూజిస్తే అనుకున్న ప‌నులు స‌కాలంలో జ‌ర‌గ‌డంతోపాటు అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట.
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment