Friday 30 April 2021

జపము, హోమము


పురోహిత పరిషత్ యందు  రుత్విక్ లతో జపము,మరియు హోమము.

 

శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం*

*సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్ |*
*జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్ || ౧*

*గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్ |*
*ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || ౨*

*యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేఽపి వా |*
*విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః || ౩*

*సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే |*
*బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ || ౪*

*ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్ |*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 

వి.యస్.యస్.పి.పి వంట వెజిల్స్

 


          వేద,శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్, ఖాధికాలని, తిరుపతి యందు. మన బ్రాహ్మణ బంధువుల కు సంబందించి ఆబ్దికములు, మాసికములు, ఇతర పూజా కార్యక్రమములకు కావాల్సిన వంట చేసుకొనుటకు ప్రస్తుతం మిగిలిన వంట పాత్రలు.. 

        ఒక్కప్పుడు చాలా చాలా వెజిల్స్ ఉండేవి పెద్ద పెద్ద వంట పాత్రలు మొదలగునవి.ఇవన్నియు గౌరవ బ్రాహ్మణ బంధువులు, ఇతర బ్రాహ్మణేతరులు విరాళమిచ్చినవే. వాటిని ఒక్కొక్కటి దొంగతనం రూపంలో పోయినవి ప్రస్తుతం ఇవిమాత్రమే ఉన్నది...

   ఇందులో  వంట ష్టవ్ మన కిరణ్ క్యాటరింగ్ వారు, గ్రైండర్ కొత్త వట్యం. గురునాధ శర్మ గారు.  విరాళంగా ఇవ్వడం. ఇలా చాలా వెజిల్స్ పెద్దలు ఇవ్వడం తో మరి కొన్ని పరిషత్ ద్వారా కొనడం జరిగినది.

 

ఇట్లు

కార్యదర్శి
వి.యస్.యస్.పి.పి
తిరుపతి

Wednesday 14 April 2021

మీరు ఏ తెలుగు సంవత్సరం లో పుట్టారు

 

*_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*


_*మీరు ఏ తెలుగు సంవత్సరం లో జన్మిచ్చారో తెలుసా_

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)*శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి..


మీ

వి.యస్.యస్.పి.పి

తిరుపతి

Monday 12 April 2021

ఉగాది చైత్ర మాసం లొనే జరుపుకోవాలి ఎందుకు

*ఉగాదిని చైత్ర మాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?

           *''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. 

          అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది''* అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.

అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం


         పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు *"చిత్రా''* నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు *"చైత్రమాసం''* అనే పేరు వచ్చింది.


*ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ?*

        ఉగాది చైత్ర మాసంలోనే ఎందుకు జరపాలి ఇతర మాసములలో  కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు ? 

      విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో  మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది ? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు ?

        ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. *''మాసానాం మార్గశీర్షోహం''* అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును , లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు ? 

         ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో , భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి , కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు , తెలివి డబ్బు , ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. 

        పోనీ శ్రీరామనవమి , శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము ? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో , ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము ? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు , పర్వదినాలు ఉన్నాయి. 

       కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా , సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..

        చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి.

         చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం , పగుళ్ళు , పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. 

        ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత , పిందెలు , పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా , ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో , వర్షాకాలంలో ఉండే మందగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.


*ఉగాదిరోజున ఏం చేయాలి ?*

*నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి* *గృహ ధ్వజారోహణం   నింబ పత్రాశనం* *సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః*

     సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది. ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి. కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.


*ఉగాది పచ్చడి తినడంవల్ల ప్రయోజనం ఏమిటి?*


*శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ*

*సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం*

        పై శ్లోకం పటిస్తూ ఉగాది పచ్చడి స్వీకరించాలి

వేపపూత , బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి.

        శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి , ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత , బెల్లం తోడ్పడతాయి.

          అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది.

       చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాద్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.

          🙏🙏🙏 వి.యస్.యస్.పి.పి 

                🙏🙏🙏తిరుపతి

ఉగాది ప్లవ నామ సంవత్సరం

*🌈సమూహం లోని సభ్యులందరికీ ముందుగా “ప్లవ” నామ సంవత్సర శుభాకాంక్షలు.

🙏🙏* *🌿🌼🙏ఉగాది పూజా విధానం🙏🌼🌿 ఉగాది పచ్చడి చేసే విధానం 🙏🌼🌿* *🌿🌼🙏


ఉగాది పర్వదినం.. పూజా విధానం🙏🌼🌿* ఉగస్య ఆదిః ఉగాది. 'ఉగ' అంటే నక్షత్రపు నడక అని అర్థం. నక్షత్రముల నడక ప్రారంభం అంటే సృష్ట్యారంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయింది. ఉగాది పండుగ చారిత్రకరీత్యా కూడా అధిక ప్రాధాన్యం కలిగి ఉంది. జగద్విఖ్యాతి కాంచిన విక్రమార్కచక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్టాభిషిక్తుడు కాగా ఆ మహావీరుని సంస్మరణ చిహ్నముగా ఆ రోజు ఉత్సవాలు జరుపుట ఆచారమైనది.

       మాసములకన్న ఋతువులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని, ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు. శిశిర ఋతువు అంటే చలికాలం పోయి, చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగిర్చి పూతలు పూస్తాయి. కోయిల కూజితములు సన్నజాజులు, మల్లెల పరిమళాలు, వసంత ఋతువులో ఆహ్లాదమును కలిగిస్తాయి. 

          ఇదే రీతి మనుష్యుని శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కుల మూలకం పొట్టు పోయి చాలా స్ఫుటముగా కనిపిస్తుంది. వసంత ఋతువు మొదలవగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవ చైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు, పకక్షులు (నెమలి మొ||వి) తమ ఈకలు రాల్చినట్లు, వృక్షములు ఆకులు రాల్చి చిగుళ్ళను సంతరించుకుటాంయి.

           కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరించడం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్టు తీసుకునే నిర్ణయాదులు కూడా అలాగే ఫలవంతం అయి ఆనందంగా ఉంటాయి.

 *"ఉగాది"🥭 *ఈ సంవత్సరం అనగా 🌈2021లో ప్లవ నామ సంవత్సర ఉగాదిగా 🚩ఏప్రియల్ నెల 13వ తారీఖున జరుపుకోబడుతుంది.

* ఉగాది రోజు పాటించవలసిన నియమాలు : 

 1. తైలాభ్యంగనం : ఉగాదిరోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి తైలాభ్యంగనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి, తలకి నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాదికాలు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేయాలి.

 2. ప్రతిగృహద్వజారోహణం : దేశానికి స్వతంత్య్రం వచ్చినప్పుడు లేదా దేశానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు సాదారణంగా జెండాలు ఎగురవేస్తుంటాం. అదే విధంగా బ్రహ్మకు సంబంధించినది, ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణ ఇంటి ముందు చేయాలట.

           మన రాష్ట్రాల్లో ఇలాటి పద్ధతులు కనిపించవు కనుమరుగై పోయింది కానీ మహారాష్ట్రలో ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను పెట్టి ధ్వజారోహణం చేస్తారు.

 3. నవవస్త్రాభరణధారణం, ఛత్రచామరాది స్వీకరణం : నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతుంది. ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పి నుంచి గొడుగు వేసుకోవడం చాలా అవసరం. 

        ఉగాది రోజు కొత్త గొడుగు సంపాదించి ఉంచుకోవాలని సంకేతం. ఛత్ర ధారణం నేెత్ర శాంతికరం, ఎండ, గాలి, వాన మున్నగు వాని నుండి కాపాడి సౌఖ్యప్రదంగా ఉంచుతుంది. ఉగాదిరోజు చామరకు కూడా స్వీకరించాలి. ఎండాకాలం విసనకర్ర ఆవశ్యకం బాగా ఉంది. వాటిలో వ్టివేళ్ళతో చేసినవి, వెదురుతో చేసినవి, తాకులతో చేసినవి శ్రేష్ఠమైనవి, వాటితో విసురుకోవడం వలన మేహశాంతి కలుగుతుంది. నేత్రాలకి చల్లదనంగా ఉంటుంది. ఛత్రచామరాలని ఈ ఎండాకాలంలో దానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. 

 4.దమనేన పూజ : దమనం అంటే ఒక పత్రి. సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలం విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణిమ వరకు రోజూ ఒక దేవతా మూర్తికి పూజ చేయాలి.


 చైత్రశుక్ల పాడ్యమి : బ్రహ్మకు; చైత్ర శుక్ల విదియ : ఉమ, శివ, అగ్నులకు ; చైత్ర శుక్ల తదియ : గౌరీ శంకరులకు; చైత్ర శుక్ల చతుర్థి : గణపతికి ; చైత్ర శుక్ల పంచమి : నాగులకు; చైత్ర శుక్ల షష్ఠి: కుమారస్వామికి; చైత్ర శుక్ల సప్తమి;సూర్యునకు ; చైత్ర శుక్ల అష్టమి:మాతృదేవతలకు; చైత్ర శుక్ల నవమి:మహిషాసుర మర్దినికి; చైత్ర శుక్ల థమి: ధర్మరాజుకు; చైత్ర శుక్ల ఏకాదశి : మునులకు; చైత్ర శుక్ల ద్వాదశి : శ్రీ మహావిష్ణువుకు; చైత్ర శుక్ల త్రయోదశి : కామదేవునకు; చైత్ర శుక్ల చతుర్దశి : శంకరునకు; చైత్ర శుక్ల పూర్ణిమ : శచి, ఇంద్రులకు సర్వాపచ్ఛాంతికర మహాశాంతి : సంవత్సరాది వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయవలసిన పండుగగా చెప్పబడి ఉంది. 

       మహాశాంతి కలిగించుట వలన అన్ని దుఃఖాలు తొలుగుతాయి. మహాశాంతి చేయవలసని పండుగలో ఇది ఒకి కాబట్టి పూర్వం ఉగాది రోజు సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాదిరోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. 


     పంచాంగపూజ, పంచాంగ శ్రవణం : ఉగాదిరోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని ప్టోలి. ప్రతి ఇంటిలో ఆ సంవత్సరం పంచాంగం ఉండాలి. పంచాంగం ఆ సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమాలకి అనువైన వాటిని చూపించే కరదీపికగా చెబుతారు. అందుకని పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకుని బ్రామ్మణ ముఖంగా లేదా జ్యోతిష్కుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి. అలా వినడం కాబట్టే పంచాంగ శ్రవణం అని పేరు.

       పంచాంగశ్రవణం వలన గంగాస్నానం చేసిన ఫలితం గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. దుస్వప్ననాశనం అవుతుంది. సంతానం, సంపత్తు కలుగుతుంది. అన్ని కర్మలు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి. 

 ప్రపాదాన ప్రారంభం : అంటే బ్రహ్మాది సమస్త దేవతా స్వరూపమైన ధర్మఘట్టం దానం చేస్తున్నాను కాన నా మనోరథములన్నీ సమకూరాలని సంకల్పం చేసి నీటి కుండను దానం చేయాలి. 

 రాజదర్శనం : ఉగాదిరోజు రాజదర్శనం చేయాలాంరు. ఈ రోజుల్లో అది అసాధ్యం కాదు కాబట్టి దేవతాదర్శనం వలన ఈశ్వరానుగ్రహం వలన అందరూ అనుకూలంగా ఉంటారు అని తెలుసుకొని దేవాలయ దర్శనం చేయడం విశేషం.


 వసంత నవరాత్రి ప్రారంభం : శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఏ విధంగా చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అదే విధంగా కలశస్థాపన చేసి అమ్మవారి పూజలు చేయాలి. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ కాని, సుందరాకాండ పారాయణ కాని రామనామ జపాన్ని కాని ప్రత్యేకంగా చేస్తారు. 


 నింబకుసుమ భక్షణం : ఉగాదిరోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం అని కొన్ని చోట్ల ఉంటే నింబ పత్ర భక్షణం అని మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుసరించి ఏర్పడిన సాంప్రదాయంగా దీన్ని చెబుతారు. వైద్యగ్రంథాలనుంచి తీసుకున్నదిగా దీన్ని చెబుతారు. నింబ కుసుమం అంటే వేప పువ్వు. నింబ పత్ర అంటే వేప ఆకు. ఇలాటి వాటిని తప్పనిసరిగా ఉగాదిరోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకి శాస్త్రం చెబుతోంది.

          దాని నుంచే మనకి ఏర్పడినది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వాటికి శని, బుధులు కూడా కారకులవుతారు. 

           కావున ఇన్ని విశిష్టతలు ఉన్న ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఎప్పుడూ ఆ శ్రీమాత దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 


 *🌿🌼🙏ఉగాది పచ్చడి విశిష్టత🙏🌼🌿*

 "ఉగాది"నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి. ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి. కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. పచ్చి మిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది. ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం ఒకటిన్నర కప్పు నీరు. రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు. కొద్దిపాటి వేప పువ్వులు. మూడు టేబుల్ స్పూన్ల బెల్లం. తగినంత ఉప్పు. రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.


 🌿🌼🙏ఉగాది పంచాంగ శ్రవణం 🙏🌼🌿 

        ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు. *


🌿🌼🙏ఉగాది శుభాకాంక్షలు 🙏🌼🌿* 

 ఈ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఒకరినొకరు "నూతన ఉగాది శుభాకాంక్షలు" తెలియపరచుకోవటం పరిపాటి. పిల్లలు పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు తీసుకొంటారు. 


 ఒక చిన్న మనవి : 

 మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, తెలుగు సంవత్సరాల పేర్లు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, కనీసం మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏదీ ఆలస్యం కాదు, అందరూ శాస్త్రోక్తంగా మన తొలి పండుగ ఉగాదిని జరుపుకుంటారని, భగవంతుని అనుగ్రహం పొందుతామని ఆకాంక్షిస్తూ 



వి.యస్.యస్.పి.పి 
తిరుపతి

ఉగాది (ప్లవ నామ సంవత్సరం)

🌺 ప్లవ నామ సంవత్సర ఉగాదికి స్వాగతం🙏 రేపు సూర్యోదయానికి పాడ్యమి ఉంటుంది గావున రేపు ఉగాది. (13.04.2021) వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం.కారణం? ప్లవ అంటే, దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనేభూరితోయం......." దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం. వికారి,శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా.మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాతది " శోభకృత్" సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని,వికాసాన్ని కలిగిస్తాయి.అభయాన్ని ప్రసాదిస్తాయి. అందుకే, ప్లవనామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం! సర్వే జనా సుఖినోభవంతు. వి.యస్.యస్.పి.పి తిరుపతి

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు

తెలుగు సంవత్సరాలు 60మాత్రమే ఎందుకు తెలుసుకోవాల్సినదంతా ఇక్కడే ఉంది... తెలుగు సంవత్సరాలు అరవై అని అందరికీ తెలుసు.ప్రభవనామ సంవత్సరంతో మొదలైన ఈ పేర్లు అక్షయ వరకూ ఉంటాయి. అసలు ఈ పేర్లు ఎలా వచ్చాయి? కేవలం అరవై మాత్రమే ఉండటానికి కారణం ఏంటి? పురాణగాథ ఏం చెబుతోంది? ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, తానొక గొప్ప త్యాగిని, సన్యాసిని అనుకొని ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువును 360 డిగ్రీల కోణంలో మనం చూడవచ్చు. అదే మనిషి కేంద్రం అయినా వర్తిస్తుంది. మనిషి ముందువైపు 180 డిగ్రీలు ఉంటే, వెనుకవైపు మరో 180 డిగ్రీలు ఉంటుంది. అంటే వెనుక ఉన్న గతం 180.. ముందు ఉన్న వర్తమాన, భవిష్యత్ లు మరో 180డిగ్రీలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే, ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది. ఇలా రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు.. ఇలా నవగ్రహాలు మన ఆయుర్థాయాన్ని పంచుకుంటే 120ఏళ్లు బతకాలి. మన తెలుగు సంవత్సరాల పేర్లు : 1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ. అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు, మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలువుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అరవై సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకూ వచ్చి వెళ్తుందన్నమాట. అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది. ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది. అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి షష్టిపూర్తి చేస్తారు. ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు... ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రంతో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత. అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి. ఇప్పుడు మనం పాటించే అర్థంపర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు. మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాదే. ఇప్పటి నుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది. పంచాగం మొదలవుతుంది. సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయింది. అదే ఉగాది అయింది. వి.యస్.యస్.పి.పి తిరుపతి