Friday, 23 December 2016

ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలలో తిరుప్పావై తొమ్మిదవ పాశురం

ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలలో ఈ రోజు తొమ్మిదవ రోజు తిరుప్పావై తొమ్మిదవ పాశురం

ఆండాళ్ తిరువడిగలే శరణం :

        ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు మూడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారిని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.

           అటువంటి ప్రేమ మనకు కావాలికదా,అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వర పము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది .

           అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ
2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
           మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు  మేల్కొల్పబదుచున్నధి.

పాశురం

     తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
    తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
    మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
    మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
    ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
    ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
    "మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
    నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!

తాత్పర్యం:

        నిర్దోషుమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా!

          ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.
   
    అవతారిక :-

          'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది.

         ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.

        (కాంభోజి రాగము - ఆదితాళము)

1. ప..    ఓ మామకూతుర! మరదలా!

అ..ప..    ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?
    ఓ మామ కూతుర! మరదలా!

చ..    పావన మణిమయ భావనమందున
    దివ్వెల వెలుగులు ధూపములమరగ
    దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి
    అవ్యక్తమైన నిద్దురపోదువటవే!

2 చ.    మూగద? చెవిటిద? మిగుల నలసినద?
    ఆగడప కావలి నందుంచబడినద ?
    ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?
    వేగమె లేపవె! నీ కూతునత్తరో!

3 చ.     లీలామానుష మాధువుడీతడు
    కేళీలోలుడు వైకుంఠవాసుడు
    చెలియలగూడి తిరునామ కీర్తనము
    ఇలవెలియగ పలుమారు పాడితిమి
    ఓ మామకూతుర! మరదలా!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment