Wednesday, 21 December 2016

ధనుర్మాసం గోధాదేవి తిరుప్పావై పాశురము ఎనిమిదవ పాశురము

తిరుప్పావై ఎనిమిదవ పాశురం

ఆండాళ్ తిరువడిగలే శరణం :

        ఈ ధనుర్మాస వ్రతము చాలా విలక్షణమైన వ్రతము . ఈ వ్రతము వల్ల మన శరీరము మంచి అలవాట్లు నేర్చుకొనుటకు బాగా దోహదపడుతుందని అర్దమవుతుంది.

            గోపికను లేపుటకు కీచు కీచు మని పక్షుల అరుపులు వినలేదా ? రేపల్లె గోపికలు తరచూ పెరుగు తరచుట నిత్యకృత్యములు . వారు పుణ్యస్త్రీలే . వారు తెల్లవారుజామున లేచి తలదువ్వుకొని పూలు ముడుచుకొని శ్రీ కృష్ణుని పాటలు పాడుతూ పెరుగు చిలుకుతారు. అప్పుడు పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చే శబ్దము ఆకాశానికి వ్యాపించేటంత ఎక్కువ వస్తుంది. అయితే వారు చిలుకుతున్నప్పుడు వారి మెడలో వున్న నగలు శబ్దములు కూడా వస్తున్నాయి కదా అవి నీకు వినబడటం లేదా ఓనాయకురాలా నీవు మిక్కిలి తెజస్సు కలదానివి .నీ తెజస్సు మాకు కనబడుతున్నది,తలుపు తెరువు నీ తెజస్సు చూచి మేము అనందించునట్లు చెయి. అని లేపారు.

        ఇంతవరకు మేల్కొలినన పిల్లలిద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడచుచుండగా నిద్రపోతున్న మరో గోపికను లేపుటకు బయలుదేరారు.ఆండాళ్ తల్లి మనిషి లక్ష్యం ఏమిటి ? వాటిని చేరుటకు ఏమిచేయ్యాలని వారికి వేదాలలోని సారాన్ని తిరుప్పావై రూపములో వివరించింది. ఆ వివరణలోమైత్రేయి సహిత కాత్యాయిని యాజ్నవల్క్య మహర్షి గురించి వివరించింది. ఆమె మెట్ట వేదాంతమ్ వివరించలేదు. ఆమె మార్గమద్యలో ఏది మంచిదో ఏది చెడ్డదో అనుభవఘ్నలయిన పెద్ద వాళ్ల సలహాతీసుకొని ముందుకు సాగాలని వారికి ఏ ఋషి గురించి చెప్పింది. శ్రీ కృష్ణుని పొందుటకు తొందరగా లేచిరమ్మని మరో గోపికను లేపుతున్నారు.

పాశురం

    కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
    మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
    పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
    కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
    పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
    మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
    దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
    ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.

తాత్పర్యం:
       తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
 
    అవతారిక:

         క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.    

            (మలయమారుత రాగము - ఆదితాళము)

ప.    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై! తరలె!
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

అ..ప.    పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు
    తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ  
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

చ..    కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన
    కేశవుడౌ సర్వేశుని జేరి
    ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతింయింప-లో
    కేశుడౌ తాను కాపాడడే మనల
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై తరలె!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి

No comments:

Post a Comment