ధనుర్మాసం లో గోదాదేవి పాడిన తిరుప్పావై పాశురములలో నాల్గవ రోజు నాల్గవ పాశురం
సర్వాంతర్యామి
ఆండాళ్ తిరువడిగలే శరణం :
గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించి వారు ఉపాయము -ఫలమని అనుకోని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయతలతో మెలిగి యున్నారు.
భగవంతుని మీద పాటలు పాడుట వల్ల రాక్షసులు పారిపోదురు. దేవతలు ఆశీర్వధించుదురు. శత్రువులు తోలగురు అని తెలుసుకొన్నారు గోపికలు.ఎవరైతే నిస్వార్ధ బుద్ది కలిగి వుంటారో వారు ఉత్తములుగా బావింతురు.అలాంటి ఉత్తముని పేరు పాడి వ్రతమునకు ఉపక్రమించారు మన గోపికలు.
వెనువెంటనే వారి కోరికలు నెరవేరుటకు వర్ష దేవత పశు సస్య సమృద్ధికి వర్శించుటకు వారి ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆ దేవతకి గోపికలు ఈ విధముగా వర్షించాలో ఆఙాపించినారు .
వెనుకటి పాశురములో త్రివిక్రముని కీర్తించి పాడి పంటలు బాగా పండాలని కోరిరి. తరువాత జగత్తునంతకు నిర్వాహకుడు అయిన సూర్యుని ప్రార్ధించుధురు. సూర్యుని అనుగ్రహము వల్ల తాము సకల శుభములు అందవలెనని ఈ గోపికలు వర్ష దేవుని ఈ పాశురములో ప్రార్ధించుధురు.
వీరు మహా భక్థి తో భగవంతుని కారున్యజలమును పొంధి , భగత్కారుణ్య రస వృస్టిని లోకమంతమును పొదునట్లు కొరుకున్నారు.
పాశురం :
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
గంభీర స్వభావుడా! వర్ష నిర్వాహకుడా! ఓ పర్జన్య దేవా! నీవు దాతృత్వములో చూపు ఔదర్యమును ఏ మార్తృమును సంకోచింపజేయుకుము.
గంభీరమగు సముద్రములో మద్యకుపోయి,ఆ సముద్రపు జలము నంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వ జగత్కారణ భూతుడగు శ్రీ మన్నారాయణుని దివ్య విగ్రహం వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాల సుందర బాహుయుగళిలో దక్షిణ బాహువు నందలి చకృము వలె మెరసి ఎడమ చేతిలో శంఖము వలె ఉరిమి శారఙ్గమను ధనస్సు నుండి విడచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతము సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము .
పర్జన్య దేవుని మన గోపికలు కోరుకుంటున్నరుఅని అర్ధము .
3 వ మాలిక
సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.
ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)
ప. వెనుదీయబోకుమా! వర్జన్యమా!
కనికరముంచుమ! వర్షాధిదైవతమ!
అ. ప. పానము చేయుమ! సాగర జలముల
ఘనమౌ గర్జన చేయగరమ్మా!
1 చ. ఆకాశమున కెగసి లోకకారణుని
పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ
2 చ. విశాల సుందర భుజ పద్మనాభుని
అసదృశమగు చక్రమువలె మెరసి
ఆశనిపాత శంఖముగ గర్జించి
ఆ శార్జపు శరములుగ వర్షింపుమా
3 చ. ఆశల, లోకము సుఖముల నొందగ
మాస మార్గళిని మాకై వర్షింపుమా
వెనుదీయబోకుమా! పర్జన్యమా!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
No comments:
Post a Comment