ధనుర్మాసం గోదాదేవి తిరుప్పావై పాశురము లలో ఈ రోజు పదవ పాశురము.
తిరుప్పావై పదవ పాశురం
శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది.
భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును.నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి ,భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను .
నమ్మాళ్వారులు వంటి మహాపురుషులు వారే విధమైన సాధనా లేకుండానే పుట్టినది మొదలు యోగాసాదనలో ఉండి భగవదనుభావమును అనుభవించువారివలె పరిపుర్ణాను భవమును అనుభవించిరి. ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.
ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు.లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది.
ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు.తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పరతంత్ర్య పరాకాష్టతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
పాశురము :
నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను (పఱై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు.
అవతారిక :-
వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను(యీ పదవ మాలికలో) లేపుచున్నారు.
(బిలహరి రాగము - రూపక తాళము)
ప.. నోము నోచి సుఖములను పొందగ దలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయ వేలనో యమ్మా!
అ..ప.. ఏమి తలుపు తీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
చ.. పరిమళించు తులసి మాలల కిరీటధారుడు
నారాయణుడే మనచే కీర్తింపబడువాడు
పురుషార్థము నిచ్చునట్టి శ్రీహరి ధర్మాత్ముడు
పురుషోత్తము గొలువ తెలివిగొని తలుపులు తీయవె!
చ.. శ్రీరాముని కాలమందు మృత్యు నోట బడె నొకడు
ఘోర నిద్ర కామించెడి వీర కుంభకర్ణుడు
ఆ రాక్షసుడోడి నీకు దీర్ఘనిద్ర నిచ్చెనో - మా
శిరోభూషణమ్మ! తెలివి చెంది తలుపు తీయవె!
నోమునోచి సుఖములను పొందదలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయవేలనో యమ్మా!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
తిరుప్పావై పదవ పాశురం
శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది.
భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును.నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి ,భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను .
నమ్మాళ్వారులు వంటి మహాపురుషులు వారే విధమైన సాధనా లేకుండానే పుట్టినది మొదలు యోగాసాదనలో ఉండి భగవదనుభావమును అనుభవించువారివలె పరిపుర్ణాను భవమును అనుభవించిరి. ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.
ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు.లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది.
ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు.తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పరతంత్ర్య పరాకాష్టతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
పాశురము :
నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను (పఱై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు.
అవతారిక :-
వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను(యీ పదవ మాలికలో) లేపుచున్నారు.
(బిలహరి రాగము - రూపక తాళము)
ప.. నోము నోచి సుఖములను పొందగ దలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయ వేలనో యమ్మా!
అ..ప.. ఏమి తలుపు తీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
చ.. పరిమళించు తులసి మాలల కిరీటధారుడు
నారాయణుడే మనచే కీర్తింపబడువాడు
పురుషార్థము నిచ్చునట్టి శ్రీహరి ధర్మాత్ముడు
పురుషోత్తము గొలువ తెలివిగొని తలుపులు తీయవె!
చ.. శ్రీరాముని కాలమందు మృత్యు నోట బడె నొకడు
ఘోర నిద్ర కామించెడి వీర కుంభకర్ణుడు
ఆ రాక్షసుడోడి నీకు దీర్ఘనిద్ర నిచ్చెనో - మా
శిరోభూషణమ్మ! తెలివి చెంది తలుపు తీయవె!
నోమునోచి సుఖములను పొందదలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయవేలనో యమ్మా!
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
No comments:
Post a Comment