మాఘ మాసం శుక్ల పక్షం ఏకాదశి
భీష్మ ఏకాదశి
కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది.
ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు.
సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.
పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. భీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.
భీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు. నలభై రోజుల పాటు అంపశయ్యపై వుండి మాఘమాస అష్టమినాడు తన ప్రాణాలను విడిచాడు. భీష్ముడు అన్ని రోజులు అంపశయ్య మీద ఎందుకున్నాడు అంటే ఆయనకు తాను చేసిన దోషం ఒకటి జ్ఞాపకం ఉంది, చేసిన ప్రతి దోషం శరీరంపై రాసి ఉంటుందట, అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట.
ఆ దోషం ఏమిటంటే ద్రౌపదికి నిండు కురుసభలో జరిగిన వస్త్రాపహరణం. వస్త్రాపహరణం జరుగుతున్నా భీష్మాచార్యుడు అడ్డుకోలేదు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు ధర్మరాజుకు తెలిపాడు. శ్రీ కృష్ణ పరమాత్మ ఎదుటే ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు.
భీష్మ పితామహుడు ధర్మరాజు సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా ఆనాడు నాకు అవమానం జరుగుతూ వుంటే అప్పుడు ఏమయ్యాయి ఈ ధర్మాలు?' అని ప్రశ్నించిందట. దానికి బీష్మపితామహుడు నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, అది నా ఆధీనంలో లేదు. నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కాబట్టే ఈ పాప ప్రక్షాళన కోసం ఇనాళ్ళూ ఈ అంపశయ్యపై పడి ఉన్నాను' అని బదులు చెప్పాడట.
కేవలం తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు. భీష్ముడు ద్రౌపదితో ఇలా అన్నాడు. కృష్ణ భక్తిలో ఎటువంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అని పలికాడు. ఆ నామాలు నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన వంటివాటిలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈ నాటికీ అందరికీ ఆయన మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.
భీష్మ పితామహుడికి పిల్లలు లేరు కానీ అపుత్రుకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితృదేవతలకు పితృతర్పణాలు ఇచ్చే సమయంలో భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథులలో ఏకాదశి ముఖ్యమైనది. అందుకే దీనికి 'హరివాసరము' అని కూడా అంటారు. ఏకాదశి తిథిన ఉపవాసం వుండి భగవన్నామ స్మరణం, జపాలు, పారాయణలతో, విష్ణునామ పఠనం తో భగవంతుడికి స్మరిస్తూ ఉంటారు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
భీష్మ ఏకాదశి
కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది.
ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు.
సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.
పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. భీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు.
భీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు. నలభై రోజుల పాటు అంపశయ్యపై వుండి మాఘమాస అష్టమినాడు తన ప్రాణాలను విడిచాడు. భీష్ముడు అన్ని రోజులు అంపశయ్య మీద ఎందుకున్నాడు అంటే ఆయనకు తాను చేసిన దోషం ఒకటి జ్ఞాపకం ఉంది, చేసిన ప్రతి దోషం శరీరంపై రాసి ఉంటుందట, అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట.
ఆ దోషం ఏమిటంటే ద్రౌపదికి నిండు కురుసభలో జరిగిన వస్త్రాపహరణం. వస్త్రాపహరణం జరుగుతున్నా భీష్మాచార్యుడు అడ్డుకోలేదు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు ధర్మరాజుకు తెలిపాడు. శ్రీ కృష్ణ పరమాత్మ ఎదుటే ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు.
భీష్మ పితామహుడు ధర్మరాజు సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా ఆనాడు నాకు అవమానం జరుగుతూ వుంటే అప్పుడు ఏమయ్యాయి ఈ ధర్మాలు?' అని ప్రశ్నించిందట. దానికి బీష్మపితామహుడు నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, అది నా ఆధీనంలో లేదు. నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కాబట్టే ఈ పాప ప్రక్షాళన కోసం ఇనాళ్ళూ ఈ అంపశయ్యపై పడి ఉన్నాను' అని బదులు చెప్పాడట.
కేవలం తండ్రికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు. భీష్ముడు ద్రౌపదితో ఇలా అన్నాడు. కృష్ణ భక్తిలో ఎటువంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చు అని పలికాడు. ఆ నామాలు నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన వంటివాటిలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈ నాటికీ అందరికీ ఆయన మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.
భీష్మ పితామహుడికి పిల్లలు లేరు కానీ అపుత్రుకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితృదేవతలకు పితృతర్పణాలు ఇచ్చే సమయంలో భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథులలో ఏకాదశి ముఖ్యమైనది. అందుకే దీనికి 'హరివాసరము' అని కూడా అంటారు. ఏకాదశి తిథిన ఉపవాసం వుండి భగవన్నామ స్మరణం, జపాలు, పారాయణలతో, విష్ణునామ పఠనం తో భగవంతుడికి స్మరిస్తూ ఉంటారు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి
No comments:
Post a Comment