Sunday, 22 January 2023

_మాఘ మాసారంభం

🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
        🌻పంచాంగం🌻
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ    ... 22 - 01 - 2023,
వారం ...  భానువాసరే ( ఆదివారం )
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
శిశిరఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,

తిధి     :  పాడ్యమి రా12.59 వరకు,
నక్షత్రం :  ఉత్తరాషాఢ 8.01 వరకు,
               తదుపరి శ్రవణం తె6.17వరకు,
యోగం :  వజ్రం మ12.05 వరకు,
కరణం  :  కింస్తుఘ్నం మ2.09 వరకు,
                తదుపరి బవ రా12.59 వరకు,

వర్జ్యం               :  ఉ11.43 - 1.12,
దుర్ముహూర్తము :  సా4.16 - 5.00,
అమృతకాలం    :  రా8.37 - 10.06,
రాహుకాలం       :  సా4.30 - 6.00,
యమగండం      :  మ12.00 - 1.30, 
సూర్యరాశి        :  మకరం,
చంద్రరాశి          :  మకరం,
సూర్యోదయం       :  6.38,
సూర్యాస్తమయం  :  5.45,

               *_నేటి విశేషం_*

*_మాఘ మాసారంభం - " మాఘ మాస విశిష్టత "_*

"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. 
ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *_శుక్ల పక్ష చవితి_* దీనిని *_తిల చతుర్థి_* అం టారు. 
దీన్నే *_కుంద చతుర్థి_* అని కూడా అంటారు, నువ్వులను తింటారు, నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. 
ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.
"కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. 
అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి.
మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. 
ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు 
*_దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!_*
అని చేసిన తరువాత 

*_సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!_* అని చదవాలని శాస్త్రాలు చెబుతున్నాయి...

*_సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి._*

ఈ మాసాన్ని *_కుంభమాసం_*  అని కూడా అంటారు.
కొంతమంది *_ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు_*
ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. 
నువ్వులను దానమివ్వాలట, రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.
ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. 

*_మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి_* అంటారు.
ఈ పంచమి నాడే *_సరస్వతీదేవి_* జన్మించిందట. 

ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.
ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు.
బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట.
అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. 
ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.

ఇక...  *_మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"_* అని కూడా పిలువబడుతుంది.
ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.
ఈ రోజున *_అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట_*.
స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు...
*_నమస్కార ప్రియ:సూర్య:_* అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.
ఈ రోజున *_చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం_*.

సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు.
హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు,
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. 
రథసప్తమి నాటి స్నానం *_సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్_* అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.

భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో *_మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట._* 
స్వచ్చంద మరణం ఆయనకి వరం. 
ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. 
అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. 
కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు...
*_భీష్మ ఏకాదశి_* నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. 
ఇక మాఘమాసంలో వచ్చే *_ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే._* 

 .... ఈ విధంగా... *_మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే..._*

               *సర్వేజనాః సుఖినోభవంతు

No comments:

Post a Comment