జలదానం వైశిష్ట్యం
చైత్ర, వైశాఖ మరియు జ్యేష్ఠ మాసములలో జలదానం తప్పక చేయవల్సినది.
మార్కండేయ పురాణం
శ్లో- తోయాన్నదాన పరాయణు డగువాడు
వేదనారహితుడై విడుచునొడలు
భావం
నిత్యం మంచినీరు దానం చేయువాడు, రవ్వంత బాధ లేకుండా చివరి దశలో శరీరం విడిచి పెడుతాడు..
దేవీ భాగవతం... నవమ స్కంధం
జల దానం వలన విష్ణు దర్శనం అవుతుంది.
వేసవి కాలంలో నీళ్లను దానం చేసిన పుణ్యాత్ములు వేయి దివ్య సంవత్సరాల కాలం విష్ణువు చేత వైకుంఠంలో సన్మానం అందుకుని, ఆ తర్వాత మణిద్వీపానికి వెళ్తారు.
వేంకటాచల మహాత్మ్యం
ఇక్ష్వాకు వంశస్థుడైన హేమాంగుడనే రాజు కులగురువు వసిష్ఠుని మాట తిరస్కరించి జలదానం చేయక, పండితులను గౌరవించక, చాతక పక్షి, కుక్కగా జన్మలు ఎత్తి, మిథిలా నగర రాజు శ్రుతకీర్తి ఇంటి గోడపై బల్లిగా జన్మ ఎత్తుతాడు. రాజు పండితుడైన శ్రుతదేవుడ్ని కడిగిన పాదజలం బల్లిపై పడి పాపవిముక్తి పొందాడు. సప్తగిరుల్లో స్వామి పుష్కరిణీ స్నానం, స్వామి దర్శనం, 7 రోజులు జలదానం చేసి స్వర్గం పొంది, వేంకటాద్రిలో జలదానం చేసిన పుణ్యం వల్ల వైవస్వత మన్వంతరంలో కాకుత్స్థుడిగా పుట్టాడు.
లింగ పురాణం
పూర్వజన్మలో సుభద్ర ఎన్ని తప్పులు చేసినా ఆకలితో ఉన్న పండితుడికి ఆతిథ్యం ఇచ్చి మరు జన్మలో రాకుమార్తె గా జన్మించింది.
*అందుకే అన్నదానం, జలదానం తప్పక చేసి తీరాలి*...
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి
No comments:
Post a Comment