విరూపాక్ష గుహలో ఉన్నపుడు బ్రాహ్మణస్వామిగా పిలవబడ్డారు.
భగవాన్ శ్రీ రమణ మహర్షి
ధ్యానం : ఆత్మవేది, ఆత్మజ్ఞాన బోధి, లీలావినోది యగు శ్రీ రమణులను ధ్యానించెదము.
జననం : 1879 డిసెంబర్ 30 (ఆర్ద్ర నక్షత్రం)
నిర్యాణం : 1950 ఏప్రిల్ 14
తల్లిదండ్రులు : అళగమ్మదేవి - సుందరమయ్యర్
మంత్రం : శ్రీ రమణం జయ రమణం అరుణాచల శివ గురు రమణం
తమిళనాట "త్రిశూలపుర"మనే "తిరుచ్చుళి" గ్రామంలో జన్మించిన రమణుల అసలుపేరు వెంకట్రామన్. అళగమ్మ అంటే సుందరమ్మ అని అర్థం. ఈ సుందరీ సుందరుల పుత్రుడైన రమణులు అరుణాచలేశుని పిలుపందుకుని నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే అరుణాచలం చేరి తీవ్ర తపోనిష్ఠలో గడిపారు. విరూపాక్ష గుహలో ఉన్నపుడు "బ్రాహ్మణస్వామి"గా పిలవబడ్డారు. తరువాత వీరి తమ్ముడు, తల్లి కూడా వీరిని అనుసరించారు. రమణుల శిష్యుల్లో ఉద్దండులైన 'కావ్యకంఠ' గణపతి 'మునీంద్రులు' పెట్టిన పేరే భగవాన్ శ్రీ రమణమహర్షి. వారు ముని.. వీరు మహర్షి! వారి పేరు గణపతికి అటూఇటూ ఉన్నవి బిరుదులు. వయసులో రమణుల కన్నా కొంచెం పెద్దవారైన కావ్యకంఠుల్ని గణపతి అవతారంగాను, రమణుల్ని కుమారస్వామి అవతారంగాను భావిస్తారు. కావ్యకంఠుల తండ్రికి వినాయకుడొచ్చి ఒళ్లో కూర్చునేవాడట. అందుకే ఆపేరు పెట్టారు. ఎందరికో గురువైన కావ్యకంఠులు రమణుల "అహం మూలాన్వేషణ" బోధతో శాంతి పొంది తమ శిష్యులతో కలిసి రమణులకు దాసోహం అన్నారు. వీరే రమణుల్ని సుబ్రహ్మణ్య అవతారమని ప్రకటించారు.
సర్వ సాధు, సర్వదైవ స్వరూపులుగా ఎందరికో నిదర్శనాలిచ్చిన సాయిబాబా గురుస్థాన్ లో కొందరు రమణ భక్తులకు రమణులు గానూ దర్శనమిచ్చారు.
రమణుల మాటల్లో పాటలు, సూక్తులు, శ్లోకాలూ క్లిష్టమైన ఆత్మ తత్వాన్ని సరళంగా సుబోధకం చేస్తూ దొర్లుతూ ఉండేవి. ఒక భక్తుడు ఆయన ముందు కూర్చుని మనసులో లాంగ్ లాంగ్ ఎగో అన్నట్టుగా "హృదయ కుహర మధ్యే.. హృదయ కుహర మధ్యే.." అంటూ పదే పదే జపిస్తూ తర్వాత పదం ఏమిటో తెలియక అవస్థ పడుతుంటే సర్వజ్ఞులైన రమణులు ఆ పదాలతో మనోజ్ఞమైన ఒక శ్లోకాన్ని ఇలా పూరించారు:
హృదయ కుహర మధ్యే
కేవలం బ్రహ్మ మాత్రమ్
హ్యహమహమితి సాక్షా
దాత్మ రూపేణభాతి
హృదివిశ మనసా స్వమ్
చిన్వతా మజ్జతా వా
పవన చలన రోధా
దాత్మ నిష్ఠో భవత్వమ్!
మంచి పనులు కాపాడతాయి.చెడ్డ పనులు వెంటాడతాయి.
ఈ వేసవిలో పక్షులు కుమూగ జీవాలకు నీరు, ఆహారం పెట్టటం ద్వారా కొన్ని రకాల అనువంశిక ఇబ్బందులు తొలగుతాయి.
తత్వమసి
అక్కడే వుండి విన్న కావ్యకంఠులు పులకించిపోతూ "ఆహా! ఇంత మంచి కవిత్వాన్ని మనం కనీవినీ ఎరుగుదుమా" అని తమ శిష్యులతో అన్నారు. పెద్ద చదువులెరుగని రమణుల కవిత్వాన్ని కావ్యకంఠులంతటివారు ప్రశంసించడం మహావిశేషం.అహం మూలాన్వేషణ, ఆత్మతత్వం అంటూ రమణులు ఉపదేశించేదే పై శ్లోకంలోనూ ఇమిడి ఉంది.
అహం మూలాన్వేషణ : కావ్యకంఠులొచ్చి ఆశ్రయించే నాటికి రమణులు చిరకాలంగా మౌనదీక్షలో ఉన్నారు. గొంతు సవరించుకుని మౌనం వీడి ఆయనతో ఇలా అన్నారు: "ఇప్పుడు మీరు "నేను" అన్నారే.. ఆ నేను అనేదాని మూలాన్ని అన్వేషించండి. అదే మీరు. అదే ఆత్మ!" ఈ మాటలు వినగానే కావ్యకంఠులు పరవశించి దాసోహం అన్నారు. భగవాన్ అని పిలవసాగారు. కావ్యాలు కంఠంలో ఉన్న పండితుడని ఆయనకు కావ్యకంఠ అనే బిరుదొచ్చింది. దేవీ సాక్షాత్కారాలు పొందినా అశాంతి పీడించేది. ఈ దశలోనే రమణుల బోధతో శాంతి కలిగిందన్నారు. ఇలా ఎందరో విదేశీ తాత్వికులు కూడా రమణుల బోధతో శాంతులయారు.
రమణుల కొంటెతనం : నేరుగా చెప్పకుండా సంకేతంగా చెప్పడం ఆలోచింపజేస్తుంది. అదే బాగా హత్తుకుంటుంది. దీన్నే మైండ్ గేమ్ అనొచ్చు. మనుషుల మైండ్ గేమ్ మైండుని, గుండెని పాడుచేస్తుంది. దేవుడి మైండ్ గేమ్ చింతన దీక్షను ప్రసాదిస్తీంది. దాని వల్ల మైండు దివ్య చైతన్యాన్ని పొందుతుంది. ఈ సృష్టి సమస్తం దేవుడి మైండ్ గేమే.. అనుక్షణం జరిగేవన్నీ ఆయన్ని గుర్తు చేసుకోడానికే అని భావించడమే దైవచింతన అవుతుంది.
అళగమ్మగారు ఒకరోజు మధ్యానం తీరిక కాగానే రమణుల ముందు కూర్చుంటూ అక్కడున్న చెంబును పక్కన పెట్టారు.
"అయ్యో! అమ్మా! అదెందుకు ముట్టుకున్నావు? దాన్నిప్పుడే వాళ్లెవరో ముట్టుకుని అక్కడ పెట్టారు. ఇప్పుడు నువు స్నానం చెయ్యాలి. బయట వానగా ఉంది. ఇప్పుడెలాగమ్మా?" అన్నారు రమణులు. అళగమ్మగారు కలవరపడి స్నానానికి వెళ్లబోతుంటే అక్కడి భక్తులు ఆపి "అమ్మగారూ! రమణులు భగవానుడని నమ్ముతున్నాం కదా! వారిని తాకితే గంగాస్నాన ఫలం కదా! ఇప్పుడీ వానలో స్నానం ఎందుకమ్మా?" అన్నారు.ఆవిడ వెంటనే అది రమణుల సూచనే అని గ్రహించి "ఔనౌను. నిజమే. అలాగే చేస్తాను" అంటూ స్నానం విరమించుకున్నారు. తల్లిగారి ఛాందస ఆచారాన్ని మాన్పించడానికే ఆయన ఇలా నడిపించారు.
బోధామృతం : ఈ ప్రపంచం మాత్రమే కాదు విశ్వాంతరాళాలన్నీ ఆత్మ దృష్టితో చూస్తే సత్యమే. ఆత్మకు భిన్నంగా చూస్తే మిథ్య! అనే రమణుల బోధలో ద్వైత, అద్వైత తత్వాల సమన్వయాన్ని దర్శించగలం. లీలల కన్నా బోధలే మహిమాన్వితమని రమణుల బోధనా సరళి బోధిస్తుంది.అంతా భగవంతుని ఆజ్ఞతోనే అనుభవించగలం. ఈశ్వరాజ్ఞ లేనిదే ఏమీ జరగదు. కర్మలతో ఆయనకు సంబంధం లేదనుకోరాదు అని రమణులు బోధించేవారు.
నిర్యాణం: అందరిలాగే వ్యాధి కూడా రమణుల్ని ఆశ్రయించింది. ఆయన దాన్నీ ప్రేమగానే ఆదరించి శరీరాన్ని విడిచారు. ఆరోజు రాత్రి 8-47 నిమిషాలకు "రమణజ్యోతి" అనే ఆ కాంతి పుంజాన్ని గగనతలంలో అనేక ప్రాంతాలవారు దర్శించారు.
"రమణజ్యోతి ఆకాశంలో ఈశాన్య దిశగా సాగిపోయిందంటూ ప్రముఖ పత్రికలు పతాక శీర్షికలతో ప్రచురించాయి.
రమణ భాగవతులు : కావ్యకంఠులు, పలువురు దేశవిదేశీ సాధుసంతులు రమణుల్ని ప్రత్యక్షంగా సేవించారు. అరవిందులు, నిత్యానందులు, చిన్మయానందులు, నారాయణ గురు తదితర యోగులు రమణ భక్తులే.గాంధీజీ కూడా అరుణాచలం వరకు వచ్చినపుడు కొండపై రమణుల్ని దర్శించాలని ఆశించినా వీలుకాలేదు. గాంధీజీ వెంట వచ్చే జనం వల్ల పైన తొక్కిసలాట జరుగుతుందని భయపడి వారి అనుచరులు వారించడంతో ఆయన సభలో మాట్లాడి వెనుదిరిగారట. అయితేనేమి? తమ అనుచరులైన నాయకులకు, స్వాతంత్ర్య సమర యోధులకు గాంధీజీ తరచూ రమణుల్ని దర్శించి రమ్మని సలహా ఇస్తుండేవారట. "ఒకసారి అరుణాచలం వెళ్లి రమణుల సన్నిధి
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్
శాంతి నగర్,ఖాధికాలని,తిరుపతి
No comments:
Post a Comment