వినాయకచవితి ఎప్పుడు చేయాలి, పూజా విధానం
వినాయకుని ఆవిర్భావం
ఈసారి వినాయక చవితి రోజు(ఆగస్టు 25)న చవితి రాత్రి 9.20 వరకు ఉన్నది. కాబట్టి ఇంటిలో పూజ చేసుకునేవారికి మధ్యాహ్నం 12లోపు పూజించాలి.
విధుల్లో మంటపాన్ని పెట్టి ఆవాహన చేసేవాళ్ళు సాయంత్రం లోపు చేయాలి.
వినాయకుని ఆవిర్భావం
భర్త కైలాసానికి వస్తున్నట్టు తెలుసుకున్న పార్వతి ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడి బొమ్మను తయారుచేసి ప్రాణం పోసింది. ఆ బాలుడిని వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్లింది.
ఆ సమయంలో శివుడు కైలాసం చేరుకున్నాడు. లోనికి వెళ్లనీయకుండా శివుడిని బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్లాడు. పార్వతీదేవి స్నానం చేసి, సర్వాలంకారాలతో శివుడి వద్దకు వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూండగా వాకిట్లో తనను అడ్డగించిన బాలుడిని సంహరించినట్టు శివుడు చెప్పాడు.
ఆ వార్తతో పార్వతి దుఃఖించడం మొదలు పెట్టింది. పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు శివుడు. ఆదిదంపతులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించారు. అతడికి ఎలుకను వాహనంగా ఇచ్చారు. కొన్ని రోజులకు శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
ఇతడిని దేవతలకు సేనా నాయకుడిగా నియమించారు. ఒకరోజు దేవతలు, మునులు కలసి కైలాసానికి వచ్చారు. విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని పరమేశ్వరుని వేడుకున్నారు. గజాననుడు మరుగుజ్జు, అసమర్థుడని, ఆ ఆధిపత్యాన్ని తనకే ఇవ్వమని కుమారస్వామి తండ్రిని కోరాడు.
దీంతో శివుడు ‘‘ముల్లోకాలలోని పుణ్య నదులలో స్నానం చేసి ఎవరు ముందుగా నా వద్దకు వస్తారో, వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను’’ అని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి ముల్లోకాలు తిరగడం మొదలు పెట్టాడు.
గజాననుడు బాధతో తండ్రి వద్దకు వచ్చి ‘‘నాన్నా..నా అసమర్థత తెలిసీ ఇలాంటి పరీక్షను పెట్టారు. దీనికి తగిన ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి’’ అని వేడుకున్నాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసిన వాడికి ఆ ఫలితం లభిస్తుందని శివుడు చెప్పాడు. వెంటనే గజాననుడు ఆ విధంగా చేశాడు.
మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తనకన్నా ముందుగా స్నానం చేసి వెళుతున్న గజాననుడు కనిపించాడు. చివరకు తండ్రి వద్దకు వచ్చిన కుమారస్వామి తన ఓటమిని అంగీకరించాడు. దీంతో శివుడు గజాననునికి విఘ్న ఆధిపత ్య పదవి ఇచ్చాడు.
ఆరోజు భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్లు ఇచ్చి పూజించిన వారికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరం ఇచ్చాడు. ఆ రోజు భక్తులు పెట్టిన కుడుములు, ఉండ్రాళ్లు తిని కైలాసానికి వచ్చిన వినాయకుడు తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయడానికి అవస్థ పడుతుండటం చూసిన చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దిష్టి తగిలి వినాయకుని కడుపు పగిలింది. మరణించిన వినాయకుని చూసి పార్వతి దుఃఖించింది. ‘‘నిన్ను చూసిన జనం పాపాత్ములై, నీలాపనిందలు పొందుతారు’’ అని చంద్రుని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.
అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది.
కావున శాపాన్ని ఉపసంహరించుకో’’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు.
శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు.
శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు.
ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు.
వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు.
శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’’ అన్నారు.
‘‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.
ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
వినాయక చవితి పూజా విధానం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే |
మన పండుగలు మన భారతీయ సంస్కృతికి అద్దంపడుతూ! అవి ఆణిముత్యాలతో గూడిన ముత్యాలహారంలా ప్రకాశిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుఉంటాయి. అటువంటి పండుగలలో విశిష్టమైనది "వినాయకచవితి'.
తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతో ప్రారంభిస్తాం. పిన్నలనుండి పెద్దలవరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజున విశేషంగా గణపతి పుట్టిన రోజు అయిన ఈ రోజు జరుపుకుంటూ ఉంటాము.
మహేశ్వరాది దేవతా గణాలందరికీ గణపతి ప్రభువు. అంటే! హిందువుల యొక్క సకలదేవతా గణాలకు ఆయనే ప్రభువన్నమాట. బ్రహ్మ తొలుత ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించేముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది మనకు. బ్రహ్మవైవర్తన పురాణమందు 'గణ' శబ్దానికి విజ్ఞానమని 'ణ' అంటే తేజస్సు అని చెప్పబడియున్నది.
ఈ ప్రపంచం అంతా గణాలతో కూడుకుని యున్నది. అటువంటి గణాలు అన్నీకలిస్తేనే ఈ ప్రపంచం! అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన "మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి.
ఇట్టి గణపతిని ఆరు రూపాలుగా పూజలు జరుపుతూంటారు.
1. మహా గణపతి,
2. హరిద్రాగణపతి
8. స్వర్ణగణపతి
4. ఉచ్చిష్ట గణపతి
5. సంతాన గణపతి
6. నవనీత గణపతి అని;
అలాగే ప్రపంచం అంతటా వారివారి ప్రాంతీయతను బట్టి భిన్న రూపాలతో ఆరాధిసూ ఉంటారు. ఈ జ్యేష్ఠరాజునకు సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి గణపతికిచ్చి వివాహం చెయ్యగా! వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు కలిగినారు. అందువల్ల ఈయన ఆరాధనవల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.
21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. వీటినే 'ఏకవింశతి' పత్రాలు అంటారు
అయితే ఆ 21 పత్రాలు ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. అలాగని ఏ ఆకుపడితే ఆ ఆకును పూజలో వినాయకునికి సమర్పించకూడదు.
వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు :
1. మాచీ పత్రం/మాచ పత్రి ,
2. దూర్వా పత్రం/గరిక ,
3. అపామార్గ పత్రం/ఉత్తరేణి ,
4. బృహతీ పత్రం/ములక,
5. దత్తూర పత్రం/ఉమ్మెత్త,
6. తులసీ పత్రం/తులసి,
7. బిల్వ పత్రం/మారేడు,
8. బదరీ పత్రం/రేగు,
9. చూత పత్రం/మామిడి,
10. కరవీర పత్రం/గన్నేరు,
11. మరువక పత్రం/ ధవనం,
12. శమీ పత్రం/జమ్మి,
13. విష్ణుక్రాంత పత్రం,
14. సింధువార పత్రం/వావిలి,
15. అశ్వత్థ పత్రం/రావి,
16. దాడిమీ పత్రం/దానిమ్మ,
17. జాజి పత్రం/జాజిమల్లి,
18. అర్జున పత్రం/మద్ది ,
19.దేవదారు పత్రం ,
20. గండలీ పత్రం/లతాదూర్వా,
21. అర్క పత్రం/జిల్లేడు.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఆకుల్ని పట్టణాల్లో అయితే కొనుగోలు చేస్తారు. అదే పల్లెల్లో అయితే ఎక్కడైనా లభ్యమవుతాయి
( వినాయక చవితి వ్రత కల్పం మరియు షోఢచోపచార పూజా విదానం వివరంగా తదుపరి పోష్టులో పోష్టు చేయబడినది)
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నాగF,ఖాదీ కాలనీ,తిరుపతిP
వినాయకుని ఆవిర్భావం
ఈసారి వినాయక చవితి రోజు(ఆగస్టు 25)న చవితి రాత్రి 9.20 వరకు ఉన్నది. కాబట్టి ఇంటిలో పూజ చేసుకునేవారికి మధ్యాహ్నం 12లోపు పూజించాలి.
విధుల్లో మంటపాన్ని పెట్టి ఆవాహన చేసేవాళ్ళు సాయంత్రం లోపు చేయాలి.
వినాయకుని ఆవిర్భావం
భర్త కైలాసానికి వస్తున్నట్టు తెలుసుకున్న పార్వతి ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడి బొమ్మను తయారుచేసి ప్రాణం పోసింది. ఆ బాలుడిని వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్లింది.
ఆ సమయంలో శివుడు కైలాసం చేరుకున్నాడు. లోనికి వెళ్లనీయకుండా శివుడిని బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్లాడు. పార్వతీదేవి స్నానం చేసి, సర్వాలంకారాలతో శివుడి వద్దకు వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూండగా వాకిట్లో తనను అడ్డగించిన బాలుడిని సంహరించినట్టు శివుడు చెప్పాడు.
ఆ వార్తతో పార్వతి దుఃఖించడం మొదలు పెట్టింది. పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడి మొండేనికి అతికించి ప్రాణం పోశాడు శివుడు. ఆదిదంపతులు ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించారు. అతడికి ఎలుకను వాహనంగా ఇచ్చారు. కొన్ని రోజులకు శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
ఇతడిని దేవతలకు సేనా నాయకుడిగా నియమించారు. ఒకరోజు దేవతలు, మునులు కలసి కైలాసానికి వచ్చారు. విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని పరమేశ్వరుని వేడుకున్నారు. గజాననుడు మరుగుజ్జు, అసమర్థుడని, ఆ ఆధిపత్యాన్ని తనకే ఇవ్వమని కుమారస్వామి తండ్రిని కోరాడు.
దీంతో శివుడు ‘‘ముల్లోకాలలోని పుణ్య నదులలో స్నానం చేసి ఎవరు ముందుగా నా వద్దకు వస్తారో, వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను’’ అని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి ముల్లోకాలు తిరగడం మొదలు పెట్టాడు.
గజాననుడు బాధతో తండ్రి వద్దకు వచ్చి ‘‘నాన్నా..నా అసమర్థత తెలిసీ ఇలాంటి పరీక్షను పెట్టారు. దీనికి తగిన ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి’’ అని వేడుకున్నాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసిన వాడికి ఆ ఫలితం లభిస్తుందని శివుడు చెప్పాడు. వెంటనే గజాననుడు ఆ విధంగా చేశాడు.
మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తనకన్నా ముందుగా స్నానం చేసి వెళుతున్న గజాననుడు కనిపించాడు. చివరకు తండ్రి వద్దకు వచ్చిన కుమారస్వామి తన ఓటమిని అంగీకరించాడు. దీంతో శివుడు గజాననునికి విఘ్న ఆధిపత ్య పదవి ఇచ్చాడు.
ఆరోజు భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్లు ఇచ్చి పూజించిన వారికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరం ఇచ్చాడు. ఆ రోజు భక్తులు పెట్టిన కుడుములు, ఉండ్రాళ్లు తిని కైలాసానికి వచ్చిన వినాయకుడు తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయడానికి అవస్థ పడుతుండటం చూసిన చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దిష్టి తగిలి వినాయకుని కడుపు పగిలింది. మరణించిన వినాయకుని చూసి పార్వతి దుఃఖించింది. ‘‘నిన్ను చూసిన జనం పాపాత్ములై, నీలాపనిందలు పొందుతారు’’ అని చంద్రుని శపించింది.
ఋషి పత్నులకు నీలాపనిందలు
పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది.
అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో ‘‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది.
కావున శాపాన్ని ఉపసంహరించుకో’’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
శమంతకోపాఖ్యానం
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు.
శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు.
శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.
శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు.
ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు.
వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు.
శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.
ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’’ అన్నారు.
‘‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.
ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
వినాయక చవితి పూజా విధానం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే |
మన పండుగలు మన భారతీయ సంస్కృతికి అద్దంపడుతూ! అవి ఆణిముత్యాలతో గూడిన ముత్యాలహారంలా ప్రకాశిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుఉంటాయి. అటువంటి పండుగలలో విశిష్టమైనది "వినాయకచవితి'.
తొలుత ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతో ప్రారంభిస్తాం. పిన్నలనుండి పెద్దలవరకూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజున విశేషంగా గణపతి పుట్టిన రోజు అయిన ఈ రోజు జరుపుకుంటూ ఉంటాము.
మహేశ్వరాది దేవతా గణాలందరికీ గణపతి ప్రభువు. అంటే! హిందువుల యొక్క సకలదేవతా గణాలకు ఆయనే ప్రభువన్నమాట. బ్రహ్మ తొలుత ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించేముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది మనకు. బ్రహ్మవైవర్తన పురాణమందు 'గణ' శబ్దానికి విజ్ఞానమని 'ణ' అంటే తేజస్సు అని చెప్పబడియున్నది.
ఈ ప్రపంచం అంతా గణాలతో కూడుకుని యున్నది. అటువంటి గణాలు అన్నీకలిస్తేనే ఈ ప్రపంచం! అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన "మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి.
ఇట్టి గణపతిని ఆరు రూపాలుగా పూజలు జరుపుతూంటారు.
1. మహా గణపతి,
2. హరిద్రాగణపతి
8. స్వర్ణగణపతి
4. ఉచ్చిష్ట గణపతి
5. సంతాన గణపతి
6. నవనీత గణపతి అని;
అలాగే ప్రపంచం అంతటా వారివారి ప్రాంతీయతను బట్టి భిన్న రూపాలతో ఆరాధిసూ ఉంటారు. ఈ జ్యేష్ఠరాజునకు సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి గణపతికిచ్చి వివాహం చెయ్యగా! వారికి క్షేముడు, లాభుడు అనే కుమారులు కలిగినారు. అందువల్ల ఈయన ఆరాధనవల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.
21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. వీటినే 'ఏకవింశతి' పత్రాలు అంటారు
అయితే ఆ 21 పత్రాలు ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. అలాగని ఏ ఆకుపడితే ఆ ఆకును పూజలో వినాయకునికి సమర్పించకూడదు.
వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు :
1. మాచీ పత్రం/మాచ పత్రి ,
2. దూర్వా పత్రం/గరిక ,
3. అపామార్గ పత్రం/ఉత్తరేణి ,
4. బృహతీ పత్రం/ములక,
5. దత్తూర పత్రం/ఉమ్మెత్త,
6. తులసీ పత్రం/తులసి,
7. బిల్వ పత్రం/మారేడు,
8. బదరీ పత్రం/రేగు,
9. చూత పత్రం/మామిడి,
10. కరవీర పత్రం/గన్నేరు,
11. మరువక పత్రం/ ధవనం,
12. శమీ పత్రం/జమ్మి,
13. విష్ణుక్రాంత పత్రం,
14. సింధువార పత్రం/వావిలి,
15. అశ్వత్థ పత్రం/రావి,
16. దాడిమీ పత్రం/దానిమ్మ,
17. జాజి పత్రం/జాజిమల్లి,
18. అర్జున పత్రం/మద్ది ,
19.దేవదారు పత్రం ,
20. గండలీ పత్రం/లతాదూర్వా,
21. అర్క పత్రం/జిల్లేడు.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఆకుల్ని పట్టణాల్లో అయితే కొనుగోలు చేస్తారు. అదే పల్లెల్లో అయితే ఎక్కడైనా లభ్యమవుతాయి
( వినాయక చవితి వ్రత కల్పం మరియు షోఢచోపచార పూజా విదానం వివరంగా తదుపరి పోష్టులో పోష్టు చేయబడినది)
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నాగF,ఖాదీ కాలనీ,తిరుపతిP
No comments:
Post a Comment