శ్రావణ బహుళ అమావాస్యను(21-08-2017) 'పోలాల అమావాస్య' మరియు ఆమ సోమవతి అమావాస్య అని కూడా అంటారు.
పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది.
ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు. శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలుగల ఆడవారు ప్రొద్దునే లేచి, తల స్నానం చేసి, మడితో వంటను చేస్తారు. ఈ కాలం లో మడితో వంట కష్టం కాబట్టి, ముందు రోజునే వంట గదిని శుభ్ర పరుచుకొని, ఉతికిన బట్టలు కట్టుకొని, అమ్మవారిని మదిలో తలచుకుంటూ వంట చేస్తారు.
పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆతర్వాత ఆకందమొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి,షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
ఆ రోజున మూడు రకాల పులుసులు, అన్నం పాయసం, బొండాలు, వడం, ఐదు రకాల కూరలు, మూడు రకాల రోటి పచ్చళ్ళు, రెండు రకాల పెరుగు పచ్చళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం గా పెడతారు.
ఆ రోజున అమ్మవారి ముందు పొలాల రూపును తాయారు చేస్తారు. అనగా, మట్టితో చిన్న స్తలంలో పొలం లాగ చేసి, మట్టితో, ఎడ్లను, గోయపోల్లడిని తాయారు చేసి ఆ పొలాల తయారీ లో పెడతారు.
ఈ వ్రతం పిల్లలు చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని చేసేవారు. ఆ కాలం లో పంటలు పండించటమే వృత్తిగా ఉండేది.అలాగె పిల్లల సంక్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. అమ్మవారిని నానావిధ పుష్పాలు, పండ్లతో, శుచిగా వండిన వంటతో కొలుస్తారు. అమ్మవారిని ఎల్లవేళలా పసుపు కుంకుమలు కాపాడమని, పిల్లలను చల్లగా చూడమని వేడుకుంటారు.
స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.
ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి.
అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు. ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు.
ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
ఈ రోజున అమ్మవారి కథ చదువుకొని, ముతైదువకు పసుపు కుంకుమలు ఇచ్చి, వారికి పసుపు తో చేసిన తోరంని చేతికి మెడలో కడతారు. అలాగే ముతైదువచే వ్రతం నోముకున్న వారు పసుపు తోరంను చేతికి మెడలో కట్టించుకుంటారు
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు.
ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి.
పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ఆర్ధికంగాను ఆదుకుంటాయి. తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.
ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రచురణలో వుంది అది
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు ఆపండుగ జరుపుకోలేకపోతున్నారు అని.
ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారు.
దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.
అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో ఆదంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.
పార్వతి దేవి తెలిపిన మరొక వ్రత కథ..
ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణిదేవి పార్వతీ దేవిని సత్పుత్రులను మరియు సకల శుభాలను కలిగించే ఒక వ్రతం గురించి తెలుపమని వేడుకుంది. అప్పుడు మాత పోలా అమావాస్య వ్రతం గురించి చెప్పింది.
పూర్వం శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు.ఆయన భార్య సుమిత్ర.వారికి ఎనిమిది మంది పుత్రులు.వారిలో పెద్దవాడి పేరు శంకరుడు,ఆయన భార్య విదేహ. ఈమెకు కలిగిన శిశువులందరూ పుట్టగానే మరణించేవారు.
ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధము ఆరంభమగుచుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. మామగారి శ్రాద్ధం భంగమగునని కోడలు విదేహను ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అత్త సుమిత్ర బెదిరించింది. భయపడిన విదేహ మృత శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించింది.
మృతశిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు విదేహను ఆదేశించగా, భయపడ్డ విదేహ తన దీనగాథను ఆమెకు వివరించింది. దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు విదేహతో ఇలా అన్నది "అమ్మా విదేహ! నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి.
శ్రావణ మాసపు అమావాస్య నాడు ఈ ఆలయానికి 64 మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు. ఆ రోజున నీవు వారికి నీ కష్టాలను తెలియజేయి. వారు నీకు తప్పక సాయం చేస్తారు.వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాగుండు" అని తెలిపింది. ఇది విన్న విదేహ అలాగే చేసింది. శ్రావణమాస అమావాస్యనాడు మధ్యరాత్రి 64 యోగినులు ఆ దేవి పూజకు విచ్చేయగా, విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాగి ఉంది.
పూజముగిసిన తర్వాత,అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా, విదేహ బయటకువచ్చి తన కష్టాలను వారికి తెలుపగా, కరుణా సాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ప్రతి సంవత్సరము శ్రావణ మాసపు అమావాస్యనాడు పోలా వ్రతం ఆచరించినచో నీకు తప్పక మంచి జరుగునని చెప్పి అంతర్థానమైయ్యారు.
సజీవులైన కుమారులతో విదేహ ఇంటికి రాగ భర్త, అత్తమామలు చాలా సంతోషించారు. అలా విదేహ ప్రతి యేటా శ్రావణ అమావాస్య నాడు పోలా వ్రతమును ఆచరించి సుఖసంతోషాలను పొందింది. కావున ఈ వ్రతాన్ని భూలోకాన శ్రావణ ఆమావాస్యనాడు ఎవరు ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి, సద్గతులు పొందుతారని పార్వతీ మాత ఇంద్రాణిదేవికి వివరించింది.
ఈ కథ విన్న తరువాత చెప్పినవారు:
"పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది. కాని అది వారి పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది . ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.
అమ సోమవతి వ్రతం -
సోమవారం + అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచు . శనివారం రోజున మాత్రమే వేప రావి చెట్టుని తాకాలి , సోమవారం రోజున చెట్టుని తాకకూడదు . సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలం వేప చెట్టు రావి చెట్టు కింద నాగ శిలలు ఉణ్టయి , ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. శిలలు కి నిలతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి.
ఆమ సోమ వార వ్రాత కధ పుస్తకం లో శ్లోకాలు చుడువుకోవాలి. ఒక వేల కధ పుస్తకం దొరకక పోతే కూడా కింద శ్లోకం చడుకుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్య వతి గ దీవించమని వెదుకొవలి. పండు నైవేద్యం నివేదించాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.
వ్రత కథ - విధానము
అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని,ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.
అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి,"సముద్రాలను దాటడమెలాగా?" అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మద్యన పడింది అన్నాచెఅన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి. అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.
అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి,ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,
"ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?" అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు.చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.
ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు.వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తోత్రం చేశారు.
కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది.దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినత్లుగా లేచి కూర్చున్నారు.
పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది.
విధానం:ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.
శ్లోకం:మూలతో బ్రహ్మరూపాయ మద్యతో విష్ణురూపిణే |
అగ్రత శ్శివరూపాయ | వృక్షరాజాయతే నమ: |
అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండో ఫలమో,మణో,మాణిక్యమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి.అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన: అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత,
వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి,బంగారంతో (యధాశక్తి) నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి,108 కలశాలను
స్థాపించి ఆరాధించాలి.ఆఖరున మండపాన్ని,కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి.ముత్తయిదువలకు 108 ఫలాలను గాని,రత్నాలను గాని వాయనదానమివ్వాలి.
సూర్యగ్రహాణం
మన భారత దేశములో కనిపించదు
తేది : 21 - 08 - 2017 , సోమవారము , అమావాస్య రోజు సంపూర్ణ సూర్య గ్రహణం ఉన్నది.
కానీ.... ఈ సూర్య గ్రహణము మన భారత దేశములో కనిపించదు.కనుక సూర్య గ్రహణము మన దేశానికి వర్తించదు.
సూర్య గ్రహణము మన దేశానికి వర్తించదు కావున గ్రహణ ప్రభావము కూడా ఉండదు.
కనుక గ్రహణ నియమాలను పాటించ వలసిన అవసరం లేదు.
గర్భిణీ స్త్రీలకు కూడా ఈ గ్రహణ ప్రభావము ఏ మాత్రమూ ఉండదు.
కావున గర్భవతి మహిళలు గ్రహణ నియమాలు , గ్రహణం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది.
ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు. శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలుగల ఆడవారు ప్రొద్దునే లేచి, తల స్నానం చేసి, మడితో వంటను చేస్తారు. ఈ కాలం లో మడితో వంట కష్టం కాబట్టి, ముందు రోజునే వంట గదిని శుభ్ర పరుచుకొని, ఉతికిన బట్టలు కట్టుకొని, అమ్మవారిని మదిలో తలచుకుంటూ వంట చేస్తారు.
పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆతర్వాత ఆకందమొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి,షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
ఆ రోజున మూడు రకాల పులుసులు, అన్నం పాయసం, బొండాలు, వడం, ఐదు రకాల కూరలు, మూడు రకాల రోటి పచ్చళ్ళు, రెండు రకాల పెరుగు పచ్చళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం గా పెడతారు.
ఆ రోజున అమ్మవారి ముందు పొలాల రూపును తాయారు చేస్తారు. అనగా, మట్టితో చిన్న స్తలంలో పొలం లాగ చేసి, మట్టితో, ఎడ్లను, గోయపోల్లడిని తాయారు చేసి ఆ పొలాల తయారీ లో పెడతారు.
ఈ వ్రతం పిల్లలు చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని చేసేవారు. ఆ కాలం లో పంటలు పండించటమే వృత్తిగా ఉండేది.అలాగె పిల్లల సంక్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. అమ్మవారిని నానావిధ పుష్పాలు, పండ్లతో, శుచిగా వండిన వంటతో కొలుస్తారు. అమ్మవారిని ఎల్లవేళలా పసుపు కుంకుమలు కాపాడమని, పిల్లలను చల్లగా చూడమని వేడుకుంటారు.
స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.
ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి.
అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు. ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు.
ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
ఈ రోజున అమ్మవారి కథ చదువుకొని, ముతైదువకు పసుపు కుంకుమలు ఇచ్చి, వారికి పసుపు తో చేసిన తోరంని చేతికి మెడలో కడతారు. అలాగే ముతైదువచే వ్రతం నోముకున్న వారు పసుపు తోరంను చేతికి మెడలో కట్టించుకుంటారు
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు.
ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి.
పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ఆర్ధికంగాను ఆదుకుంటాయి. తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను పెద్దలను పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.
ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రచురణలో వుంది అది
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు ఆపండుగ జరుపుకోలేకపోతున్నారు అని.
ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారు.
దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.
అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో ఆదంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.
పార్వతి దేవి తెలిపిన మరొక వ్రత కథ..
ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణిదేవి పార్వతీ దేవిని సత్పుత్రులను మరియు సకల శుభాలను కలిగించే ఒక వ్రతం గురించి తెలుపమని వేడుకుంది. అప్పుడు మాత పోలా అమావాస్య వ్రతం గురించి చెప్పింది.
పూర్వం శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు.ఆయన భార్య సుమిత్ర.వారికి ఎనిమిది మంది పుత్రులు.వారిలో పెద్దవాడి పేరు శంకరుడు,ఆయన భార్య విదేహ. ఈమెకు కలిగిన శిశువులందరూ పుట్టగానే మరణించేవారు.
ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధము ఆరంభమగుచుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. మామగారి శ్రాద్ధం భంగమగునని కోడలు విదేహను ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అత్త సుమిత్ర బెదిరించింది. భయపడిన విదేహ మృత శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించింది.
మృతశిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు విదేహను ఆదేశించగా, భయపడ్డ విదేహ తన దీనగాథను ఆమెకు వివరించింది. దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు విదేహతో ఇలా అన్నది "అమ్మా విదేహ! నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి.
శ్రావణ మాసపు అమావాస్య నాడు ఈ ఆలయానికి 64 మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు. ఆ రోజున నీవు వారికి నీ కష్టాలను తెలియజేయి. వారు నీకు తప్పక సాయం చేస్తారు.వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాగుండు" అని తెలిపింది. ఇది విన్న విదేహ అలాగే చేసింది. శ్రావణమాస అమావాస్యనాడు మధ్యరాత్రి 64 యోగినులు ఆ దేవి పూజకు విచ్చేయగా, విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాగి ఉంది.
పూజముగిసిన తర్వాత,అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా, విదేహ బయటకువచ్చి తన కష్టాలను వారికి తెలుపగా, కరుణా సాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ప్రతి సంవత్సరము శ్రావణ మాసపు అమావాస్యనాడు పోలా వ్రతం ఆచరించినచో నీకు తప్పక మంచి జరుగునని చెప్పి అంతర్థానమైయ్యారు.
సజీవులైన కుమారులతో విదేహ ఇంటికి రాగ భర్త, అత్తమామలు చాలా సంతోషించారు. అలా విదేహ ప్రతి యేటా శ్రావణ అమావాస్య నాడు పోలా వ్రతమును ఆచరించి సుఖసంతోషాలను పొందింది. కావున ఈ వ్రతాన్ని భూలోకాన శ్రావణ ఆమావాస్యనాడు ఎవరు ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి, సద్గతులు పొందుతారని పార్వతీ మాత ఇంద్రాణిదేవికి వివరించింది.
ఈ కథ విన్న తరువాత చెప్పినవారు:
"పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది. కాని అది వారి పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది . ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.
అమ సోమవతి వ్రతం -
సోమవారం + అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచు . శనివారం రోజున మాత్రమే వేప రావి చెట్టుని తాకాలి , సోమవారం రోజున చెట్టుని తాకకూడదు . సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలం వేప చెట్టు రావి చెట్టు కింద నాగ శిలలు ఉణ్టయి , ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. శిలలు కి నిలతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి.
ఆమ సోమ వార వ్రాత కధ పుస్తకం లో శ్లోకాలు చుడువుకోవాలి. ఒక వేల కధ పుస్తకం దొరకక పోతే కూడా కింద శ్లోకం చడుకుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్య వతి గ దీవించమని వెదుకొవలి. పండు నైవేద్యం నివేదించాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.
వ్రత కథ - విధానము
అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని,ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.
అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి,"సముద్రాలను దాటడమెలాగా?" అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మద్యన పడింది అన్నాచెఅన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి. అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.
అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి,ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,
"ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?" అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు.చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.
ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు.వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తోత్రం చేశారు.
కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది.దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినత్లుగా లేచి కూర్చున్నారు.
పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది.
విధానం:ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.
శ్లోకం:మూలతో బ్రహ్మరూపాయ మద్యతో విష్ణురూపిణే |
అగ్రత శ్శివరూపాయ | వృక్షరాజాయతే నమ: |
అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండో ఫలమో,మణో,మాణిక్యమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి.అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.
ఉద్యాపన: అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత,
వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి,బంగారంతో (యధాశక్తి) నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి,108 కలశాలను
స్థాపించి ఆరాధించాలి.ఆఖరున మండపాన్ని,కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి.ముత్తయిదువలకు 108 ఫలాలను గాని,రత్నాలను గాని వాయనదానమివ్వాలి.
సూర్యగ్రహాణం
మన భారత దేశములో కనిపించదు
తేది : 21 - 08 - 2017 , సోమవారము , అమావాస్య రోజు సంపూర్ణ సూర్య గ్రహణం ఉన్నది.
కానీ.... ఈ సూర్య గ్రహణము మన భారత దేశములో కనిపించదు.కనుక సూర్య గ్రహణము మన దేశానికి వర్తించదు.
సూర్య గ్రహణము మన దేశానికి వర్తించదు కావున గ్రహణ ప్రభావము కూడా ఉండదు.
కనుక గ్రహణ నియమాలను పాటించ వలసిన అవసరం లేదు.
గర్భిణీ స్త్రీలకు కూడా ఈ గ్రహణ ప్రభావము ఏ మాత్రమూ ఉండదు.
కావున గర్భవతి మహిళలు గ్రహణ నియమాలు , గ్రహణం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు.
మీ
వేద, శాస్త్ర,స్మార్త పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
No comments:
Post a Comment