ఈ రోజు(12.09.2017) మంగళ వారం కావేరి పుష్కరము ప్రారంభం.
కావేరి అనగానే తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న నదీజలాల వివాదమే గుర్తుకువస్తుంది. కానీ వేల సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలకు అతీతంగా గుంభనంగా సాగిపోతోంది ఆ నదీమతల్లి. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆ కావేరికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సందర్భంగా కావేరి గురించి కొన్ని విశేషాలు…
మన దేశంలోని ముఖ్య నదులన్నింటి జననం వెనుకా ఏదో ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాగే కావేరీనదికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వం కావేరుడనే రుషి ఉండేవాడట. తనకు సంతానం లేకపోవడంతో.ఒక కుమార్తెని అందించమంటూ ఆయన బ్రహ్మను వేడుకున్నాడు. అంతట బ్రహ్మ తన దగ్గర ఉన్న లోపాముద్ర అనే బాలికను, కావేరునికి అందించాడు. కావేరుడు పెంచుకున్నాడు కనుక లోపాముద్రని కావేరిగా పిలవసాగారు.
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ రోజు 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.
ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.
యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.
యుక్తవయసు రాగానే కావేరిని అగస్త్య మహామునికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహసమయంలో కావేరి ఒక షరతుని విధించింది. అగస్త్యుడు తనని ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉంటే... తన దారిని తను చూసుకుంటానన్నదే ఆ షరతు. అగస్త్యుడు చాలాకాలం ఆ షరతుకి లోబడే ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తన శిష్యులకి ఏదో బోధిస్తూ కాలాన్ని గమనించుకోలేదు. కాలాతీతం కావడంతో కావేరి అలిగి నదిగా మారిపోయింది.
మరో గాథ ప్రకారం కావేరిని అగస్త్యుడు తన కమండలంలో బంధించి ఉంచుతాడు. ఒకరోజు కమండంలో నుంచి కావేరి అరుపులను విన్న వినాయకుడు ఆమెను విడిపించాలని అనుకున్నాడు. అందుకోసం గణేశుడు ఒక కాకి రూపాన్ని ధరించి ఆ కమండలాన్ని ఒంపేశాడు. దాంతో అందులో ఉన్న కావేరి జలరూపంగా బయటకు రాగలిగింది. అప్పటి నుంచి కావేరి జలరూపంలో ప్రవహిస్తోందని నమ్ముతారు.
గాథలు ఏవైనా కావేరి నది దక్షిణభారతీయుల పాలిట దాహార్తిని తీర్చే దేవతే! కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలలో ప్రవహిస్తూ కొన్ని లక్షల ఎకరాల పొలాలను సాగునీటిని అందిస్తోంది. వందేళ్ల క్రితం కావేరి మీద నిర్మించిన ‘కృష్ణరాజసాగర్ డ్యాం’ పుణ్యమా అని కర్ణాటక కరువుకి దూరంగా ఉంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా కావేరి నదీ జలాలతో విద్యుత్తుని ఉత్పత్తి చేశారు.
కావేరి నదీజలాల విషయాన్ని అలా ఉంచితే, ధార్మికంగా కూడా కావేరి తీరం యావత్తూ పుణ్యక్షేత్రాలకు ఆలవాలంగా తోస్తుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల మీద ఈ కావేరి నది ఉద్భవిస్తుంది. కావేరి జన్మించిన ఆ స్థానంలో నదీస్నానం ఆచరించేందుకు వేలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఈ ప్రాంతాన్ని తలకావేరి అని పిలుస్తారు. తలకావేరితో పాటుగా శ్రీరంగం, తిరుచిరాపల్లి, కుంబకోణం, తిరువాయూరులాంటి అనేక క్షేత్రాలు కావేరి తీరాన ఉన్నాయి.
కావేరి నది తమిళనాడులోని పూంపుహార్ పట్నం దగ్గర బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈ పట్నాన్ని ‘కావేరి పూంపట్టినం’ అని పిలిచేవారు. ఇది చోళుల రాజధానిగా ఉండేది. చోళులకి కావేరీ నది అంటే చాలా ఇష్టంగా ఉండేదేమో! అందుకనే చోళుల కాలంలో కావేరీ తీరం పొడవునా దాదాపు 300 ఆలయాలను నిర్మించారట. ఇవే కాకుండా ‘పంచరంగ క్షేత్రాలు’ పేరుతో కావేరి తీరాన రంగనాథస్వామి పేరిట ఐదు ఆలయాలు వెలిశాయి. మనకి పంచారామాలు ఎలాగో తమిళవాసులకు పంచరంగ క్షేత్రాలు అలాగన్నమాట. వీటిలోని శ్రీరంగం గురించి అందరికీ తెలిసిందే!
కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు.
తలకావేరి, కుషల్ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్ కావేరీనది వరప్రసాదమే.
బెంగళూరు పులి టిప్పుసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్ గార్డెన్స్... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి.
పుణ్యతీర్థాలు
చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం.
భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి.
మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.
ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
కావేరి అనగానే తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న నదీజలాల వివాదమే గుర్తుకువస్తుంది. కానీ వేల సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలకు అతీతంగా గుంభనంగా సాగిపోతోంది ఆ నదీమతల్లి. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆ కావేరికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సందర్భంగా కావేరి గురించి కొన్ని విశేషాలు…
మన దేశంలోని ముఖ్య నదులన్నింటి జననం వెనుకా ఏదో ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాగే కావేరీనదికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వం కావేరుడనే రుషి ఉండేవాడట. తనకు సంతానం లేకపోవడంతో.ఒక కుమార్తెని అందించమంటూ ఆయన బ్రహ్మను వేడుకున్నాడు. అంతట బ్రహ్మ తన దగ్గర ఉన్న లోపాముద్ర అనే బాలికను, కావేరునికి అందించాడు. కావేరుడు పెంచుకున్నాడు కనుక లోపాముద్రని కావేరిగా పిలవసాగారు.
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ రోజు 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.
ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.
యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.
యుక్తవయసు రాగానే కావేరిని అగస్త్య మహామునికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహసమయంలో కావేరి ఒక షరతుని విధించింది. అగస్త్యుడు తనని ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉంటే... తన దారిని తను చూసుకుంటానన్నదే ఆ షరతు. అగస్త్యుడు చాలాకాలం ఆ షరతుకి లోబడే ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తన శిష్యులకి ఏదో బోధిస్తూ కాలాన్ని గమనించుకోలేదు. కాలాతీతం కావడంతో కావేరి అలిగి నదిగా మారిపోయింది.
మరో గాథ ప్రకారం కావేరిని అగస్త్యుడు తన కమండలంలో బంధించి ఉంచుతాడు. ఒకరోజు కమండంలో నుంచి కావేరి అరుపులను విన్న వినాయకుడు ఆమెను విడిపించాలని అనుకున్నాడు. అందుకోసం గణేశుడు ఒక కాకి రూపాన్ని ధరించి ఆ కమండలాన్ని ఒంపేశాడు. దాంతో అందులో ఉన్న కావేరి జలరూపంగా బయటకు రాగలిగింది. అప్పటి నుంచి కావేరి జలరూపంలో ప్రవహిస్తోందని నమ్ముతారు.
గాథలు ఏవైనా కావేరి నది దక్షిణభారతీయుల పాలిట దాహార్తిని తీర్చే దేవతే! కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాలలో ప్రవహిస్తూ కొన్ని లక్షల ఎకరాల పొలాలను సాగునీటిని అందిస్తోంది. వందేళ్ల క్రితం కావేరి మీద నిర్మించిన ‘కృష్ణరాజసాగర్ డ్యాం’ పుణ్యమా అని కర్ణాటక కరువుకి దూరంగా ఉంది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా కావేరి నదీ జలాలతో విద్యుత్తుని ఉత్పత్తి చేశారు.
కావేరి నదీజలాల విషయాన్ని అలా ఉంచితే, ధార్మికంగా కూడా కావేరి తీరం యావత్తూ పుణ్యక్షేత్రాలకు ఆలవాలంగా తోస్తుంది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని బ్రహ్మగిరి పర్వతాల మీద ఈ కావేరి నది ఉద్భవిస్తుంది. కావేరి జన్మించిన ఆ స్థానంలో నదీస్నానం ఆచరించేందుకు వేలాదిమంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. ఈ ప్రాంతాన్ని తలకావేరి అని పిలుస్తారు. తలకావేరితో పాటుగా శ్రీరంగం, తిరుచిరాపల్లి, కుంబకోణం, తిరువాయూరులాంటి అనేక క్షేత్రాలు కావేరి తీరాన ఉన్నాయి.
కావేరి నది తమిళనాడులోని పూంపుహార్ పట్నం దగ్గర బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అందుకే ఒకప్పుడు ఈ పట్నాన్ని ‘కావేరి పూంపట్టినం’ అని పిలిచేవారు. ఇది చోళుల రాజధానిగా ఉండేది. చోళులకి కావేరీ నది అంటే చాలా ఇష్టంగా ఉండేదేమో! అందుకనే చోళుల కాలంలో కావేరీ తీరం పొడవునా దాదాపు 300 ఆలయాలను నిర్మించారట. ఇవే కాకుండా ‘పంచరంగ క్షేత్రాలు’ పేరుతో కావేరి తీరాన రంగనాథస్వామి పేరిట ఐదు ఆలయాలు వెలిశాయి. మనకి పంచారామాలు ఎలాగో తమిళవాసులకు పంచరంగ క్షేత్రాలు అలాగన్నమాట. వీటిలోని శ్రీరంగం గురించి అందరికీ తెలిసిందే!
కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు.
తలకావేరి, కుషల్ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్ కావేరీనది వరప్రసాదమే.
బెంగళూరు పులి టిప్పుసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్ గార్డెన్స్... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి.
పుణ్యతీర్థాలు
చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం.
భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి.
మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.
ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
Pushkaralu explanation bavundi
ReplyDelete