Saturday, 22 July 2017

ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా మరియు భీమన అమావాస్య అని కూడా పిలుస్తుంటారు

     ఈ రోజు అనగా 23.07.2017 ఆదివారం,అమావాస్య.
    ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా మరియు భీమన అమావాస్య అని కూడా పిలుస్తుంటారు

           సాధారణంగా అమావాస్య అనేది పితృదేవతలను ఆరాధించే ముఖ్యమైన రోజుగా భావిస్తుంటారు. ఇక ఈ విషయంలో ఆషాఢ అమావాస్య మరింత ముఖ్యమైనదిగా చెబుతుంటారు. ఈ రోజున పితృకార్యాలను నిర్వహిస్తూ, వారి ఆత్మలకు సంతృప్తిని చేకూరుస్తుంటారు. వారి ఆశీస్సులే తమను నడిపిస్తాయని నమ్ముతుంటారు.

           ఆషాఢ బహుళ అమావాస్యను 'చుక్కల అమావాస్య'గా కూడా పిలుస్తుంటారు. వివాహితులైన స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుతూ ఈ రోజున వ్రతాన్ని చేస్తుంటారు. దీప స్తంభానికి సున్నపు చుక్కలు పెట్టడం ... నైవేద్యంగా పచ్చి పిండితో చుక్కలు పెట్టడం, వెండి చుక్కను గానీ బంగారు చుక్కను గాని దానంగా ఇవ్వడం ఈ వ్రత విధానంలో ప్రత్యేకంగా కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే దీనిని చుక్కల అమావాస్య అని అంటారు.

           ఈ రోజున కొన్ని ప్రాంతాలలో 'దీపపూజ'ను నిర్వహిస్తుంటారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో ఒక వేదిక వంటిది ఏర్పాటు చేసుకుని, దానిపై ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో ప్రమిదలు వుంచి వెలిగించి, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
            ఈ రోజున సాయంత్రం కూడా ఇదే విధంగా దీపాలను పూజించి, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వడం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన శుభం జరుగుతుందని విశ్వసిస్తుంటారు.

         ఈ రోజున స్త్రీలు అందరు గౌరీ అమ్మవారికి పూజ చేసి బియ్యం పిండి, పాలు కలిపి ఆ ముద్దతో చిన్న చిన్న ఉండలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ ముద్దలను చుక్కలుగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో కొత్త కోడళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారికి పూజ చేసి, 100 చుక్కలను, దారమును వంద వరుసలు పోసి దండగా చేసి మరుసటి రోజు వరకు దానిని ధరించడం, అమావాస్య రోజు సాయంత్రం కేవలం పాయసం, కొంత అల్పాహారం మాత్రమే తినడం జరుగుతుంది.
మరుసటి రోజు నుండి శ్రవణ మాసం ప్రారంభం అవుతుంది

ఆషాడ అమావాస్య మరొక విశేషం

           పుష్యమి నక్షత్రం ఆదివారం అమవాస్య రావడం ఎంతో విశేషం చాలా సంవత్సరాలకి ఒకసారి ఇలా వస్తుంది. ఈ అమావాస్య పుష్యర్క యోగం ఉండటం వలన మనం చేసేటువంటి పూజ జపం దానం కొన్ని కోట్ల రేట్ల ఫలితం ఇస్తుంది

             సకలాబీష్ట ప్రదాత , ఆర్థజన రక్షకుడు అయిన నరసింహ స్వామి ని ఆదివారం అమావాస్య రోజు పూజించడం వలన సకల దోషాలు పరిహార మవుతాయి

            ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం  చాలా విశేషం ఈ రోజున నరసింహ స్వామి సన్నిధిలో బియ్యం పిండి తో దీపం చేసి నేతి తో  దీపారాధన చేసి తీర్థ ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది

           ఆడి అమావాస్య రోజు తమిళనాడు లో అహోబిల మఠం అధిన క్షేత్రం అయిన తిరువల్లూర్ అనే క్షేత్రం లో వెలసిన వైద్య వీర రాఘవ స్వామి వారిని ఎంతో అద్భుతం గా పూజిస్తారు

          అలాంటి విధంగా మన అహోబిల మఠం భద్రాచలం లో అదే తరహా పద్దతి లో వైభవంగా ఆరాధన జరుగుతుంది.కావున నృసింహ స్వామి ని ఆదివారం అమావాస్య నాడు ఆరాధించడం వల్ల  అసంఖ్యాక మైన ఫలితం పొందుతము

           ఈ విశ్వం మొత్తం సకల ప్రాణికోటి ముక్కోటి దేవతలు నవగ్రహాలు నక్షత్రలు అన్ని కూడా నృసింహ ఆజ్ఞ మేరకే నడుస్తారు అని పెద్దల మాట

           భద్రాచలం శ్రీ అహోబిల మఠం లో ఆడి అమావాస్య పూజ కొరకు  విశేష ఏర్పాట్లు చేయడం అయినది
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
    

No comments:

Post a Comment