28.07.2017 శుక్రవారం శ్రావణ పంచమి ఈ రోజే గరుడ పంచమి గా వ్యవహరిస్తారు.
శ్రావణ శుద్ద పంచమిని మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరినది సాగర ప్రాంతీయులు గరుడ పంచమి పర్వంగా వ్యవహరిస్తున్నారు. పురాణ గాథలు విచారిస్తే నాగులకి, గరుడిడికి విరోధం ఉండడం తెలిసి వస్తుంది. ఆ గాథల్లో గరుడుడే విజేతగా ఉంటుంటాడు. కాని దీనికి భిన్నంగా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గరుడుడే తీసికట్టు అయినట్లు గాథలు ఉన్నాయి.
గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకుడికి ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధంలో గరుత్మంతుడు ఓడిపోయాడు. నాగవిగ్రహం కల యంత్రపు బిళ్లను మెడలో వేళ్లాడ కట్టుకుని ఉండే షరతు మిూద ఇద్దరికీ రాజీ అయింది. ఇది వంగదేశంలో వాడుకలో ఉన్న పురాణకథ. సర్పరాజుకు గరుత్మండు నమస్కరిస్తూ ఉన్నట్లు శిల్పఖండాలు ఉన్నాయి.
వ్రతరత్నాకరంలో గరుడపంచమి ప్రస్తావన ఉంది. గోదావరి మండల ప్రాంతపు పంచాంగాలలో మాత్రము ఒకటి రెండింటియందు గరుడ పంచమి పేర్కొనబడుతుంది. విష్ణువుకు గరుడుడు వాహనం. విష్ణు ఆలయాల్లో ఆ వాహనాలు ఉండడం వాని మీద ఊరేగింపులు సాగడం ఉంటూ ఉంటుంది. గరుడిడికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండడం అరుదు.
గురుడుకి వైనతేయుడని మరోపేరు ఉంది. గోదావరి ఏడుపాయల్లో ఒకదానికి వైనతేయ అని పేరు. అది వసిష్ఠ గోదావరి నుండి గన్నవరం అనే ఊరువద్ద నుండి విడిపోతుంది. ఆ గన్నవరం వద్ద గరుడేశ్వరస్వామికి ఒక ఆలయం ఉంది. గన్నవరాన గరుడేశ్వర స్వామిని గరుడుడు ప్రతిష్టించాడని ప్రతీతి ఉంది. వైనతేయ పాయను తీసుకువెళ్లింది వైనతేయుడైన గరుడుడు లేక వైనతేయ బుషి అంటారు.
నాగపంచమి తిథికే గరుడపంచమి అనే పేరు కూడ ప్రవర్తితం కావడానికి ఏమిటి కారణం? ఈ జిజ్ఞాసకు సమాధానం బ్రహ్మాండపురాణంలో ఉంది. శ్రావణ శుక్ల పంచమినాడు గరుడుడు అమృతాపహారణం చేశాడు. అందుచేత దీనికి గరుడ పంచమి అనే పేరు వచ్చింది.
గరుడుడు అమృతం తెచ్చి సవతితల్లికి ఇచ్చి తన తల్లి దాస్యం బాపాడు. సవతి తల్లి పిల్లలైన నాగులు ఆ అమృతాన్ని తాగడానికి సిద్దపడులోగా దేవతలు దానిని తిరిగి కొనిపోయారు. గరుడుడు అమృతం తెచ్చిన రోజు కాబట్టి దీనికి గరుడపంచమి అనే పేరు వచ్చింది.
అంతేకాని ఈనాటి పూజా విధానంలో గరుడిడి ప్రమేయం ఏమిన్ని లేదు. వ్రత రత్నాకరంలో గరుడపంచమివ్రత విషయం ఉంది. కాని అందలి పూజాదికాలలో నాగసంబంధమే కాని గరుడ సంబంధమేమిూ కానరాదు.
గరుడపంచమి వ్రత విధాన గురించి తెలుసుకుందాము
ఈ వ్రతం శ్రావణ శుక్లపంచమిూ దినాన సోదరులు కల పది సంవత్సరాలు చేయతగింది. ఆనాడు ఆ స్త్రీ స్నానం చేసి చతురశ్రమైన మంటపం ఏర్పరచాలి. ఫలకుసుమాదులచే దానిని అలంకరించాలి. పంచవర్ణపు ముగ్గులు పెట్టాలి. నడుమ బియ్యం పోయాలి. సర్ప ప్రతిమను ఆ బియ్యం మిూద ఉంచాలి. దాని పడగ మధ్యలో గౌరీబింబాన్ని స్థాపించాలి. ఆ గౌరిని, పదిమళ్లు గల దోరమును షోడశోపచారాలతో పూజించాలి. ఆ తోరాన్ని తాను ధరించాలి.
పూజా విధానం, వ్రతం పేరేమో గరుడ పంచమియా వ్రతమని ఆ వ్రతంలో పూజ అంతా సర్పప్రతిమకు, గరుడుడికి, సర్పాలకి సహజవిరోధం, అగుచో గరుడిడి పేర పరగే పర్వం నాడు నాగపూజ ఎట్లు ఏర్పడింది? గరుడుడు అమృతం తెచ్చి ఇచ్చాడు. అతడి పని వల్ల దాస్యం తీరింది. అమృతం మాత్రం నాగుల అనుభవానికి అందలేదు. అందుచేత నాగులు అతపులు కావడం సహజం. అసంతృప్తులైన నాగులకు తృప్తి కలిగించడం కోసం పూజలు సల్చడం వారి విరోధితో జతపడిన ఈ ప్రత్యేకింపబడింది.
ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
'' తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో"
యజుర్వేద మంత్రం.
'' ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను,
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు మరలా మరలా నమస్కారము.
'' ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll
శుభంభవతు
"శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః
పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ
విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ"
గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తమ ఇష్టదైవమైన గరుడుని పై తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోనూ అగ్రగన్యుడు గరుత్మంతుడు ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్రపక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రిలు తమ పుట్టే సంతానం గరుడుని లాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గల వాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.
చక్కని సంతానాన్ని ఇచ్చే గరుడ పంచమి
కశ్యప ప్రజాపతికి వినత.. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు.
దీనిని సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.
సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది
నాగ పంచమి / శ్రావణ పంచమి/ గరుడ పంచమి ఏర్పడడానికి గల కారణం.
శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.
అంతా అనుకూలంగా ఉంటుంది. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.
నాగ జాతి జనము :
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .
దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .
"విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి .
మీ నాగులంతా ఆతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (ఈ రోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి.
ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కథ
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తున్నవి దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను .
ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది.
మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి..
ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది.
మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారుఅందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ.
జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి.
క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.
కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
శ్రావణ శుద్ద పంచమిని మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరినది సాగర ప్రాంతీయులు గరుడ పంచమి పర్వంగా వ్యవహరిస్తున్నారు. పురాణ గాథలు విచారిస్తే నాగులకి, గరుడిడికి విరోధం ఉండడం తెలిసి వస్తుంది. ఆ గాథల్లో గరుడుడే విజేతగా ఉంటుంటాడు. కాని దీనికి భిన్నంగా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో గరుడుడే తీసికట్టు అయినట్లు గాథలు ఉన్నాయి.
గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకుడికి ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధంలో గరుత్మంతుడు ఓడిపోయాడు. నాగవిగ్రహం కల యంత్రపు బిళ్లను మెడలో వేళ్లాడ కట్టుకుని ఉండే షరతు మిూద ఇద్దరికీ రాజీ అయింది. ఇది వంగదేశంలో వాడుకలో ఉన్న పురాణకథ. సర్పరాజుకు గరుత్మండు నమస్కరిస్తూ ఉన్నట్లు శిల్పఖండాలు ఉన్నాయి.
వ్రతరత్నాకరంలో గరుడపంచమి ప్రస్తావన ఉంది. గోదావరి మండల ప్రాంతపు పంచాంగాలలో మాత్రము ఒకటి రెండింటియందు గరుడ పంచమి పేర్కొనబడుతుంది. విష్ణువుకు గరుడుడు వాహనం. విష్ణు ఆలయాల్లో ఆ వాహనాలు ఉండడం వాని మీద ఊరేగింపులు సాగడం ఉంటూ ఉంటుంది. గరుడిడికి ప్రత్యేకంగా ఆలయాలు ఉండడం అరుదు.
గురుడుకి వైనతేయుడని మరోపేరు ఉంది. గోదావరి ఏడుపాయల్లో ఒకదానికి వైనతేయ అని పేరు. అది వసిష్ఠ గోదావరి నుండి గన్నవరం అనే ఊరువద్ద నుండి విడిపోతుంది. ఆ గన్నవరం వద్ద గరుడేశ్వరస్వామికి ఒక ఆలయం ఉంది. గన్నవరాన గరుడేశ్వర స్వామిని గరుడుడు ప్రతిష్టించాడని ప్రతీతి ఉంది. వైనతేయ పాయను తీసుకువెళ్లింది వైనతేయుడైన గరుడుడు లేక వైనతేయ బుషి అంటారు.
నాగపంచమి తిథికే గరుడపంచమి అనే పేరు కూడ ప్రవర్తితం కావడానికి ఏమిటి కారణం? ఈ జిజ్ఞాసకు సమాధానం బ్రహ్మాండపురాణంలో ఉంది. శ్రావణ శుక్ల పంచమినాడు గరుడుడు అమృతాపహారణం చేశాడు. అందుచేత దీనికి గరుడ పంచమి అనే పేరు వచ్చింది.
గరుడుడు అమృతం తెచ్చి సవతితల్లికి ఇచ్చి తన తల్లి దాస్యం బాపాడు. సవతి తల్లి పిల్లలైన నాగులు ఆ అమృతాన్ని తాగడానికి సిద్దపడులోగా దేవతలు దానిని తిరిగి కొనిపోయారు. గరుడుడు అమృతం తెచ్చిన రోజు కాబట్టి దీనికి గరుడపంచమి అనే పేరు వచ్చింది.
అంతేకాని ఈనాటి పూజా విధానంలో గరుడిడి ప్రమేయం ఏమిన్ని లేదు. వ్రత రత్నాకరంలో గరుడపంచమివ్రత విషయం ఉంది. కాని అందలి పూజాదికాలలో నాగసంబంధమే కాని గరుడ సంబంధమేమిూ కానరాదు.
గరుడపంచమి వ్రత విధాన గురించి తెలుసుకుందాము
ఈ వ్రతం శ్రావణ శుక్లపంచమిూ దినాన సోదరులు కల పది సంవత్సరాలు చేయతగింది. ఆనాడు ఆ స్త్రీ స్నానం చేసి చతురశ్రమైన మంటపం ఏర్పరచాలి. ఫలకుసుమాదులచే దానిని అలంకరించాలి. పంచవర్ణపు ముగ్గులు పెట్టాలి. నడుమ బియ్యం పోయాలి. సర్ప ప్రతిమను ఆ బియ్యం మిూద ఉంచాలి. దాని పడగ మధ్యలో గౌరీబింబాన్ని స్థాపించాలి. ఆ గౌరిని, పదిమళ్లు గల దోరమును షోడశోపచారాలతో పూజించాలి. ఆ తోరాన్ని తాను ధరించాలి.
పూజా విధానం, వ్రతం పేరేమో గరుడ పంచమియా వ్రతమని ఆ వ్రతంలో పూజ అంతా సర్పప్రతిమకు, గరుడుడికి, సర్పాలకి సహజవిరోధం, అగుచో గరుడిడి పేర పరగే పర్వం నాడు నాగపూజ ఎట్లు ఏర్పడింది? గరుడుడు అమృతం తెచ్చి ఇచ్చాడు. అతడి పని వల్ల దాస్యం తీరింది. అమృతం మాత్రం నాగుల అనుభవానికి అందలేదు. అందుచేత నాగులు అతపులు కావడం సహజం. అసంతృప్తులైన నాగులకు తృప్తి కలిగించడం కోసం పూజలు సల్చడం వారి విరోధితో జతపడిన ఈ ప్రత్యేకింపబడింది.
ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
'' తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో"
యజుర్వేద మంత్రం.
'' ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను,
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు మరలా మరలా నమస్కారము.
'' ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll
శుభంభవతు
"శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః
పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ
విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ"
గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తమ ఇష్టదైవమైన గరుడుని పై తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించడం జరుగుతుంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోనూ అగ్రగన్యుడు గరుత్మంతుడు ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్రపక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రిలు తమ పుట్టే సంతానం గరుడుని లాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గల వాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.
చక్కని సంతానాన్ని ఇచ్చే గరుడ పంచమి
కశ్యప ప్రజాపతికి వినత.. కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి 'నాగ పంచమి'గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, శ్రావణ శుద్ధ పంచమిని 'గరుడ పంచమి' అని కూడా పిలుస్తుంటారు.
శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా వుండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే 'గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున, గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు.
దీనిని సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.
సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది
నాగ పంచమి / శ్రావణ పంచమి/ గరుడ పంచమి ఏర్పడడానికి గల కారణం.
శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.
అంతా అనుకూలంగా ఉంటుంది. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.
నాగ జాతి జనము :
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .
దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .
"విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి .
మీ నాగులంతా ఆతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (ఈ రోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి.
ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కథ
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తున్నవి దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను .
ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది.
మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి..
ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది.
మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారుఅందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ.
జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి.
క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.
కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి
మీ
వేద, శాస్త్ర, స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలనీ,తిరుపతి
No comments:
Post a Comment