Friday, 24 March 2017

శని త్రయోదశి రోజున చేయవలసిన పనులు, నేడు శ్రీ శని త్రయోదశి శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి


శని త్రయోదశి రోజున చేయవలసిన పనులు,
నేడు శ్రీ శని త్రయోదశి

           చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. 
            మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. 

               వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

శనిదోష పరిహారానికి...

          శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.
 భైరవ స్తోత్రం  చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.

        శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. 

           కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం.

శని త్రయోదశి తిథి నాడు ఏంచేయాలి

          నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రహం
ఛాయా మార్తాండ సంభూతం నమామి శ్రీశనైశ్చరం- శనీశ్వరుడు గ్రహాధిపతి. నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు. ప్రభావశాలి. మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మకర కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞ, ఆమె సంతానం వైవస్వతుడు, శ్రాద్ధదేవుడు, యముడు, యమున.

          సంజ్ఞ సూర్యుని తేజాన్ని భరించలేక తననుంచి ఛాయను సృజించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయింది. ఛాయకు సూర్యుడికి సావర్ణుడు, శనైశ్చరుడు జన్మించాడు.

        శనీశ్వరుని గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాలు విభిన్న విషయాలు వివరిస్తున్నాయి. శని మందగమనం గలవాడు గనకు మాదుడు అంటారు. ఇతని వాహనం కాకి, నలుపు, నీలివర్ణాలు ఈయనకు ఇష్టమైనవి. జిల్లేడు ఆకులు, తిలలు, తైలాభిషేకం ఇష్టం.

శని భార్య జ్యేష్ఠాదేవి.

       సర్వ జీవరాశిని సత్యమార్గంలో నడిపించడానికి శని అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. దానధర్మాలతో, సత్యాహింసలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని అనుసరించేవారికి శని ఎల్లప్పుడూ అండగా ఉండి శుభాలు కలిగిస్తాడని, ఆ కారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి.

           శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మ ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆ కర్మ ఫలితాలను సిద్ధింపజేస్తాడు.అయితే అనాదిగా శనీశ్వరుడంటే పీడించి కష్టనష్టాలు కలిగించే వాడనే భావం ప్రబలంగా ఉంది. కానీ శని దూషణ కూడదు. శనీశ్వర దూషణ సర్వదేవతా దూషణ. శని కృప సకల దేవతాకృపతో సమానం.కాగా త్రయోదశి తిథి, శనివారం శనికి ప్రీతికరమైనవి.
          శనీశ్వరునికి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు తైలాభిషేకం శ్రేష్ఠమైనదంటారు. అలాగే ప్రతి నెలా వచ్చే త్రయోదశి తిథినాడు తిలదానం కూడా ప్రశస్తమని చెబుతారు. దశరథుడు, నల మహారాజు, పరీక్షిత్తు, ధర్మరాజు మొదలైనవారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని కథనాలు ఉన్నాయి.
          లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాన్ని కప్పి గంధం, నీలి పుష్పాలు, తిలాన్నాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. కోణస్థ, పింగల తదితర శనిదశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే శని బాధ కలగదని విశ్వాసం. శనిత్రయోదశి అయిన నాడు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహం పొందుదాం.!

తిల దీపం ఎలా పెటాలి : 
         నల్ల నువ్వులు నల్ల గుడ్డలో కట్టి ఇనుము ప్రమదిలొ దీపం పెట్టలి. నల్ల నువ్వుల మూట పెట్టి సనీస్వరుడుకి ఎదురుగ పెటాలి. శని త్రయోదశి అంటే శని హోర లో పూజ చేసుకోవాలి.

తిల దానం : తిల దానం  చేస్తారు సాని జపం చేయించుకుంటారు . జపం అయిన తరువాత ఇనుప పాత్రలో నల్ల నువూలు పోసి, ఇనుమ శని ప్రతిమ కానీ లేదా ఇనుమ మేకు కానీ పెట్టి నల్ల గుడ్డ కప్పి దానం ఇవాలి.శని ప్రదోషం రోజున - శని దోషం పోవాలని శివుడిని పూజ చేయటం, శని ప్రదోషం రోజున శని పూజ , శివ పూజ కూడా వుంటుంది.

             శని అంతర్దసలు,ఏలినాటి శని , అర్దాష్టమి శని కానీ , శని అష్టమంలో శని కి దోష పరిహారం చేయించుకోవాలి. ఇ కాలం(శని దోషం) లో శనివారం రోజున సంకల్పం చేపుకోవాలి ఈ రోజు నేను శని ప్రదోషం వుంటాను అని సాయంత్రం శివాలయానికి వెళ్లి శనికి నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నునె తలమీద నుంచి పోసి (అభిషేకం) చేసి నువ్వుల నునె తో దీపం పెటాలి. (తిల దీపం పేటనవసంరం లేదు ) శని ఆశ్తోత్రం , స్తోత్రం చదువుకోవాలి. శివుడికి దీపారాధన చేయాలి -రెండు వోతులు.

చండి ప్రదక్షిణ చేయాలి:

             శివుడికి అబిషేకించిన జలాని (సోమసుత్రం ) దాటకూడదు. నంది దగరనుంచి సోమసుత్రం వరుకు ప్రదక్షిణ చేసి మల్లి వెనకి తిరిగి నంది వరుకు వస్తే అది ఒక ప్రదక్షిణ  ఇలా 11 సార్లు చేయాలి. అని దేవత విగ్రహాలు పక్క పక్క నే వుంటే అందరి దేవులకు ప్రదక్షిణ కలిపి చేసేటపుడు సోమసుత్రం ఎలాగో దాటం కాబటి అప్పుడు పర్వాలేదు. శివుడికి అబిషేకించిన జలాని మాత్రం ఎట్టి పరిస్థితులోనూ దాట కూడదు (సోమసుత్రం ) దాటకూడదు.

           అర్చన కానీ అభిషేకం , హారతి పండో పుష్పం శివుడికి నివేదించి ఎవరికైనా పళ్ళుకానీ సంపర్పించి ఈశ్వర ఎ రోజు నేను శని ప్రదోషం వున్నాను. నాకు శని దోషాలు పోవాలి అని సంకల్పం చేపుకోవాలి. తరువాత పెదవాలకి కానీ బ్రాహ్మణునికి కానీ భోజనం పెటాలి, లేదా బ్రాహ్మణునికి స్వయపాకం ఇవాలి. లేదా షాకాధానం (కూరగాయలు వండుకోవడానికి వీలయినంత ఉప్పు కూడా ఇవాలి). లేదా 2/3 పండ్లు దానం ఇవాలి. అంటే శివ దర్శనం అయి దానం అయిన తరువాత మాత్రమే భోజనం చేయాలి.

శని ప్రదోషం చేసే వారు పాటించాల్సిన నియమాలు : బ్రహ్మచర్య చేయాలి , ఉల్లి వెల్లులి  తినకూడదు , మద్యపానం చేయకూడదు.

శని కి చదువుకోవలిసిన స్తోత్రాలు : శని జపం బ్రాహ్మణుని చేత జపం చేయించుకోవాలి. శని కవచం :శని కవచం చదవటం వలన శని రక్షణ కవచం లాగా వుంటాడు. హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామికి శనివారం ప్రదక్షిణాలు చేయటం, రావి  చెట్టు కి శనివారం ప్రదక్షిణాలు చేయటం , రవి చెట్టు దగర దత్త పారాయణం చేయటం వలన కూడా శని దోషాలు పోతాయి.( రావి చెట్టు కి ప్రదక్షిణాలు కేవలం శనివారం మాత్రమె చేయాలి , ఎందుకంటే రవి చెట్టు లో జేష్ట దేవి ఉంటుంది ).

శని వలన సారీరకంగా కలిగే భాదలు: శని వలన గస్త్రిక్ , పాదాలు , ఒంటి నెప్పులు శని కారకుడు. కళ్ళకి , కనురేప్పలకి , కళ్ళలోని కోర్నియ కి శని కారకుడు .

శని త్రయోదశి ప్రాముఖ్యత

           నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

           జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం  చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

           బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.

          శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి  , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

           క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

           ఆ సమయం లో శివుడు ,  మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.  ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

           ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.

               ఈ సమయం లో శివుడికి చేసే  పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,

శనిత్రయోదశి రోజున  ఉపవాసం ఉండడం,

రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం,

 నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం.

నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం,

నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.

వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.

వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం

ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి

మద్యమాంసాదులను ముట్టరాదు.

వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.

శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)

        ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

శని మహత్యం:

         శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు.

            చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి.

           శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

           బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు.

         శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు.

              తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి
మీ
వేద,శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment