వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్, శాంతి నగర్ ,ఖాధికాలని తిరుపతి అధ్యక్షులు శ్రీ రామ కృష్ణ శాస్త్రి గారి అధ్యక్షతన, కార్యదర్శి శ్రీ.చక్రాల.కోటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో సాధారణ సర్వే సభ్య సమావేశము 19.06.2022 (ఆదివారం) సాయంత్రం 4.00 గలకు నిర్వహించడం జరిగినది.
ఇందులో కార్యవర్గ సభ్యులు
శ్రీ.రాధేశ్యామ్ గారు, శ్రీ చిద్విలాష్ గారు, శ్రీ.గురుమూర్తి గారు, శ్రీ వేణుగోపాల్ శర్మ గారు, యం.దొరస్వామి గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇందులో ముఖ్య అతిగా మన పరిషత్ సంభందించి చార్టెట్ అకౌంటెంట్ శ్రీ వెంకటనాద్ గారు సమావేశము నకు హాజరై విలువైన సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగినది.
ఇందులో ప్రతి కార్యవర్గ సభ్యులు విధిగా కొంత మందిని సభ్యులుగా చేర్చుకోనుటకు ప్రయత్నం చేయవలయును, పరిషత్ ని బలోపేతం చేయవలయునని సలహా ఇవ్వడం జరిగినది.
ప్రతి పండుగ పరిషత్ లో నిర్వహించి అందుకు సంబంధించి ఫొటోలు, మినిట్స్, పేపర్ క్లిపింగ్స్, మొదలగునవి చేయగలిగితే మరింత బలోపేతం అవ్వడానికి ఆస్కారం వుంటుంది అని.
మన సాంప్రదాయం విలువ మరింత పెంపొందించే ముఖ్య సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.
No comments:
Post a Comment