Monday, 22 March 2021

పురోహిత పరిషత్

తిరుపతి, ఖాధికాలని, అన్నారావు సర్కిల్ దగ్గరలో మన బ్రాహ్మణలకు సంబంధించి ఆబ్దికములు, మాసికములు ఇక్కడే అయ్యవార్లను ఏర్పాటు చేసి నిర్వహించ బడును , లేదా యజమానులే అయ్యవార్లు ఏర్పాటు చేసుకున్న వారికి వేదిక, వంట పాత్రలు ఇవ్వబడును ముఖ్యం అత్యంత మడుగు గా, శుభ్రంగా,పద్దతి గా వారు అలవాటు ప్రకారం ఏ వంటలు చేయవలయునో వారు చెప్పిన వంటలు రుచిగా చేసి సంతృప్తి కరంగా కార్యక్రమము నిర్వహించబడును. ముఖ్యంగా:: ఇక్కడ వ్యాపార నిమిత్తమై నిర్వహించడం లేదు; మన బ్రాహ్మణ సభ్యులకు సేవా భావంతో చేయబడుచున్నది. రోజుకు ఒక్క ఆబ్దికము నిర్వహించబడును. అందరి లాగా సామూహిక కార్యక్రమాలు చేయబడదు.మరియు ఇతరులకు పూజ,జపములు, హోమాలు మొదలగునవి జరిపించుకొనుటకు అన్నివిధాల సౌకర్యంగా పద్దతి గా నిర్వహించబడును. ముఖ్య గమనిక. ఎవ్వరైనా ఇంటిలో కార్యక్రమము చేసుకొన్నచో వారి ఇంటికి అయ్యవార్లు ని కూడా పంపబడును. వంట వారిని కూడా ఏర్పాటు చేయబడను వి.యస్.యస్.పి.పి, తిరుపతి

పరిషత్ కార్యవర్గ సమావేశము









వేద శాస్త్ర స్మార్త పురోహిత పరిషత్,ఖాధికాలని, తిరుపతి యందు గౌరవ అధ్యక్షులు శ్రీయుతులు రామకృష్ణ శాస్ర్తి గారి అధ్యక్షతన, కోశాధికారి, శ్రీ చక్రాల కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సభ్యులందరి సమక్షంలో సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో గత ఆర్థిక ( 2020-2021) ఆదాయము, వ్యయములు, నిర్వహణ మొదలగు న విషయాలు చర్చించి మరియు ఉత్తరోతర పరిషత్ అభివృద్ధి సంబందింది సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది..


కోశాధికారి

వి.యస్.యస్.పి పి

ఖాదీ కాలనీ, తిరుపతి