మార్గశిర మాసము19.11.2017ఆదివారము ప్రారంభం
మార్గశిర మాస విశిష్టత
సౌరమానము ప్రకారము సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన మాసము కావున ఈ మాసమునకు 'ధనుర్మాసము' అని పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రంలో ఉంటే, ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారు. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం రావటం వలన ఈ మాసమును మార్గశిర మాసము అంటారు.
‘మార్గశీర్ష ’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.
“బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం”
అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు ఋతువుల లోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.
శ్రీ సూర్య భగవానుడు పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసము చొప్పున మారుతూ ఉండేదాన్ని ‘సంక్రమణము’ అంటారు. మనకు సంవత్సరానికి పన్నెండు సంక్రమణములు వస్తాయి.
సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతా లతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో
‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’
అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.
మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం” చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికపరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గమాసం లో భగవంతునియందు లయించవలెనన్న తపనగల వారు అందరూ ఈ మార్గశిర మాసములో వైష్ణవ ప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు అర్హులే.
ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూ ధనుడు’ అనే నామముతో శ్రీ మహావిష్ణువును పూజించ వలెను. ఈరోజునుండి ధనుర్మాసం ప్రారంభమైనట్లే.
ఈ రోజునుండి ప్రతిరోజు విష్ణ్వాలయాలలోప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్ఠం. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి
మనకెలాగైతే దినమునందు బ్రాహ్మీ ముహూర్తము సత్వగుణ ప్రభావము కలదని భావింపబడునో, అదే విధముగా మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వలె చాలా సత్వగుణ ప్రభావము కలదని దేవతలు భావింతురు. అలాంటి పవిత్రమైన మాసంలో గోదాదేవి వ్రతమును ఆచరించింది కావున ఈ వ్రతానికి గొప్ప విశిష్టత లభించింది.
గోదా జననం
యజ్ఞవాటికికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా విష్ణుచిత్తుల వారు తులసివనంలో మొక్కలకి గొప్పులు తవ్వుతుండగా అతనికి ఒక బాలిక లభించినది. వారికి సంతానము లేకపోవుటచే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకొనుచు 'కోదై' (పూలదండ) అనే పేరుతొ పిలుచుకుంటూ ఉండేవారు.
ఆ పేరే క్రమేపి 'గోదా' అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది. ఆమె బాల్యము నుండి జన్మసిద్ధమగు పరిమళముగల తులసివలె - జ్ఞాన, భక్తి, వైరాగ్యములు కలిగి భగవత్గుణముల యందే ఆశక్తి కలిగి యుండెడిది. తన తండ్రి ద్వారా భగవత్ కథలను విని,ఆ భగవంతునినే తన ప్రియునిగా భావించి, వివాహమాడదలచినది.
పూర్వము ద్వాపరయుగమున వ్రజభూమిలో, గోపికలు కాత్యాయిని వ్రతము చేసి, కృష్ణునిపొందినట్లుగా తెలుసుకొని, తాను కూడా శ్రీవిల్లిపుత్తూరునే వ్రజభూమిగా భావించి, తన తోటి చెలికత్తెలనే గోపికలుగా భావించి, తాను కూడా వారిలో ఒక గోపికగా ఉండి, ఆ వటపత్రసాయి ఆలయమునే నందగోప భవనముగా భావించి, ఆ ఆలయములో నున్న వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా తలచి 'మార్గశీర్ష వ్రతాన్ని'ఆచరించినది.
ఆ వ్రతమును తరువాతి తరముల వారికి అందించవలెనని, ఒక్కో పాటలో- మనం ఏంతెలుసు కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలి, అనే విషయాలని, ముప్పై రోజులు ముప్పై పాశురాలుగా (పాటల రూపంలో) భగవంతుని కీర్తించి అందరికీ 'తిరుప్పావై' ప్రబంధముగా అందించింది.
గోదా కల్యాణం
చిన్నప్పటి నుండి గోదాదేవి శ్రీరంగనాథుని యందే మనస్సు లగ్నం చేసి ఆరాధించుచుండెను. ప్రతీరోజు భగవంతునికి అర్పింపవలసిన పుష్పమాలికను తాను ధరించి, అద్దంలో చూసుకొని, మళ్ళీ ఆ మాలను అదే స్థలంలో పెట్టెడిది.
ఆ విషయం తెలియక విష్ణుచిత్తులవారు ఆ మాలను భగవంతునికి సమర్పించెడివారు. ఒకరోజు ఈ దృశ్యమును విష్ణుచిత్తులవారు గమనించి, ఆరోజు భగవంతునికి మాలికను సమర్పించకుండిరి.
అదేరోజు రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తులవారికి కలలో ప్రత్యక్షమై, "గోదా ధరించి విడిచిన మాలనే నాకు సమర్పించు, అవియే నాకు అత్యంత ప్రీతికరం" (ఆరోజు నుండి విష్ణుచిత్తులు అదే విధంగా చేయుచుండిరి.) "నేనే - నీకుమార్తెను వివాహమాడెదను.
వివాహమహోత్సవానికి నా అజ్ఞ మేరకు తగిన సామగ్రులను తీసుకొని, పాండ్య మహారాజు ఘన స్వాగతంతో మిమ్ములను దంతపుపల్లకిలో ఆహ్వానించెదరు" అని చెప్పి అంతర్థానమయ్యెను. విష్ణుచిత్తులు మేల్కొని, ఆనందోత్సాహముతో తన జన్మ సార్థకమయ్యిందని, పొంగిపోతూ తెల్లవారిన తరవాత గోదాదేవిని తీసుకొని, శ్రీరంగమునకు వెళ్ళెను.
శ్రీరంగమున అందరూ చూస్తుండగా పల్లకీ దిగి, గోదాదేవి గర్భగుడిలో ప్రవేశించి, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి, స్వామి దివ్య తిరువడి గళ్ళలో (పాదపద్మములలో) అంతర్ధాన మయ్యెను.మాలను ధరించి విడుచుట వలన గోదాదేవికి"ఆముక్తమాల్యద" అనియు, "శూడిక్కొడుత్త నాన్చియార్"అనే దివ్య నామములు కలిగెను. ఆమెనే "ఆండాళ్" అని కూడా అందురు. (ఆండాళ్ అనగా రక్షించుటకు వచ్చినది).
విగ్రహ రూపంలో ఉన్న స్వామిని వివాహమాడి, గోదమ్మతల్లి భోగములను అనుభవించినది కావున, ఈ రోజుని 'భోగి' అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వ భోగ భాగ్యాలు లభించునని మన పెద్దలు చెప్పారు. భోగభాగ్యాలు కలిగించే పండుగ కనుక భోగి పండుగ అని కూడా అంటారు.
"శ్రీ ఆండాళ్ దివ్య తిరువడి గళే శరణం"
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి
మార్గశిర మాస విశిష్టత
సౌరమానము ప్రకారము సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన మాసము కావున ఈ మాసమునకు 'ధనుర్మాసము' అని పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రంలో ఉంటే, ఆ మాసాన్ని ఆ నక్షత్రం పేరుతొ పిలుస్తారు. పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం రావటం వలన ఈ మాసమును మార్గశిర మాసము అంటారు.
‘మార్గశీర్ష ’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.
“బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం”
అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు ఋతువుల లోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.
శ్రీ సూర్య భగవానుడు పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసము చొప్పున మారుతూ ఉండేదాన్ని ‘సంక్రమణము’ అంటారు. మనకు సంవత్సరానికి పన్నెండు సంక్రమణములు వస్తాయి.
సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతా లతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో
‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’
అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.
మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం” చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికపరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గమాసం లో భగవంతునియందు లయించవలెనన్న తపనగల వారు అందరూ ఈ మార్గశిర మాసములో వైష్ణవ ప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు అర్హులే.
ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూ ధనుడు’ అనే నామముతో శ్రీ మహావిష్ణువును పూజించ వలెను. ఈరోజునుండి ధనుర్మాసం ప్రారంభమైనట్లే.
ఈ రోజునుండి ప్రతిరోజు విష్ణ్వాలయాలలోప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి ‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్ఠం. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి
మనకెలాగైతే దినమునందు బ్రాహ్మీ ముహూర్తము సత్వగుణ ప్రభావము కలదని భావింపబడునో, అదే విధముగా మార్గశీర్ష మాసము బ్రాహ్మీ ముహూర్తము వలె చాలా సత్వగుణ ప్రభావము కలదని దేవతలు భావింతురు. అలాంటి పవిత్రమైన మాసంలో గోదాదేవి వ్రతమును ఆచరించింది కావున ఈ వ్రతానికి గొప్ప విశిష్టత లభించింది.
గోదా జననం
యజ్ఞవాటికికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా విష్ణుచిత్తుల వారు తులసివనంలో మొక్కలకి గొప్పులు తవ్వుతుండగా అతనికి ఒక బాలిక లభించినది. వారికి సంతానము లేకపోవుటచే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకొనుచు 'కోదై' (పూలదండ) అనే పేరుతొ పిలుచుకుంటూ ఉండేవారు.
ఆ పేరే క్రమేపి 'గోదా' అనే నామంగా వ్యవహారంలోకి వచ్చింది. ఆమె బాల్యము నుండి జన్మసిద్ధమగు పరిమళముగల తులసివలె - జ్ఞాన, భక్తి, వైరాగ్యములు కలిగి భగవత్గుణముల యందే ఆశక్తి కలిగి యుండెడిది. తన తండ్రి ద్వారా భగవత్ కథలను విని,ఆ భగవంతునినే తన ప్రియునిగా భావించి, వివాహమాడదలచినది.
పూర్వము ద్వాపరయుగమున వ్రజభూమిలో, గోపికలు కాత్యాయిని వ్రతము చేసి, కృష్ణునిపొందినట్లుగా తెలుసుకొని, తాను కూడా శ్రీవిల్లిపుత్తూరునే వ్రజభూమిగా భావించి, తన తోటి చెలికత్తెలనే గోపికలుగా భావించి, తాను కూడా వారిలో ఒక గోపికగా ఉండి, ఆ వటపత్రసాయి ఆలయమునే నందగోప భవనముగా భావించి, ఆ ఆలయములో నున్న వటపత్రసాయినే శ్రీకృష్ణునిగా తలచి 'మార్గశీర్ష వ్రతాన్ని'ఆచరించినది.
ఆ వ్రతమును తరువాతి తరముల వారికి అందించవలెనని, ఒక్కో పాటలో- మనం ఏంతెలుసు కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలి, అనే విషయాలని, ముప్పై రోజులు ముప్పై పాశురాలుగా (పాటల రూపంలో) భగవంతుని కీర్తించి అందరికీ 'తిరుప్పావై' ప్రబంధముగా అందించింది.
గోదా కల్యాణం
చిన్నప్పటి నుండి గోదాదేవి శ్రీరంగనాథుని యందే మనస్సు లగ్నం చేసి ఆరాధించుచుండెను. ప్రతీరోజు భగవంతునికి అర్పింపవలసిన పుష్పమాలికను తాను ధరించి, అద్దంలో చూసుకొని, మళ్ళీ ఆ మాలను అదే స్థలంలో పెట్టెడిది.
ఆ విషయం తెలియక విష్ణుచిత్తులవారు ఆ మాలను భగవంతునికి సమర్పించెడివారు. ఒకరోజు ఈ దృశ్యమును విష్ణుచిత్తులవారు గమనించి, ఆరోజు భగవంతునికి మాలికను సమర్పించకుండిరి.
అదేరోజు రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తులవారికి కలలో ప్రత్యక్షమై, "గోదా ధరించి విడిచిన మాలనే నాకు సమర్పించు, అవియే నాకు అత్యంత ప్రీతికరం" (ఆరోజు నుండి విష్ణుచిత్తులు అదే విధంగా చేయుచుండిరి.) "నేనే - నీకుమార్తెను వివాహమాడెదను.
వివాహమహోత్సవానికి నా అజ్ఞ మేరకు తగిన సామగ్రులను తీసుకొని, పాండ్య మహారాజు ఘన స్వాగతంతో మిమ్ములను దంతపుపల్లకిలో ఆహ్వానించెదరు" అని చెప్పి అంతర్థానమయ్యెను. విష్ణుచిత్తులు మేల్కొని, ఆనందోత్సాహముతో తన జన్మ సార్థకమయ్యిందని, పొంగిపోతూ తెల్లవారిన తరవాత గోదాదేవిని తీసుకొని, శ్రీరంగమునకు వెళ్ళెను.
శ్రీరంగమున అందరూ చూస్తుండగా పల్లకీ దిగి, గోదాదేవి గర్భగుడిలో ప్రవేశించి, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి, స్వామి దివ్య తిరువడి గళ్ళలో (పాదపద్మములలో) అంతర్ధాన మయ్యెను.మాలను ధరించి విడుచుట వలన గోదాదేవికి"ఆముక్తమాల్యద" అనియు, "శూడిక్కొడుత్త నాన్చియార్"అనే దివ్య నామములు కలిగెను. ఆమెనే "ఆండాళ్" అని కూడా అందురు. (ఆండాళ్ అనగా రక్షించుటకు వచ్చినది).
విగ్రహ రూపంలో ఉన్న స్వామిని వివాహమాడి, గోదమ్మతల్లి భోగములను అనుభవించినది కావున, ఈ రోజుని 'భోగి' అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వ భోగ భాగ్యాలు లభించునని మన పెద్దలు చెప్పారు. భోగభాగ్యాలు కలిగించే పండుగ కనుక భోగి పండుగ అని కూడా అంటారు.
"శ్రీ ఆండాళ్ దివ్య తిరువడి గళే శరణం"
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాధికాలని, తిరుపతి
No comments:
Post a Comment