Friday, 5 May 2017

ఈ రోజు అనగా 06-05-2017 శుక్రవారము ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అని అంటారు


ఈ రోజు అనగా 06-05-2017 శుక్రవారము ఏకాదశి దీనినే మోహిని ఏకాదశి అని అంటారు

ఏకాదశి అనగా ఏమి, వాటి ఫలితము ఏమిటి?.

        ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.

                మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి ఫలములు:
           ఏకాదశి వ్రతమును గురించి తెలియని వారు ఉండరు. శ్రీ మహావిష్ణువు ప్రీతీ కొరకు ఏకాదశి వ్రతమును పాటిస్తారు. ఆషాఢమాసం నుండి జేష్ఠ మాసం వరకు  వచ్చే తొలి ఏకాదశి మొదలుకొని సంవత్సరంలో వచ్చే అన్ని ఎకాదశులకు వివిధ నామాలు, వాటియొక్క ఫలితములు తెలుసుకొందాం;

1. ఆషాఢ శుద్ధ ఏకాదశి: శయనైకాదశి.: (తొలి ఏకాదశి ): దక్షిణాయన ప్రారంభం: ఆయుర్వృద్ధి.
2. ఆషాఢ బహుళ ఏకాదశి : కామ్యైకాదశి : ఇష్ట కామ్యార్ధ సిద్ది.
3. శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదైకాదశి: పుత్ర సంతాన ప్రాప్తి.
4. శ్రావణ బహుళ ఏకాదశి: అజైకాదశి: సమస్త దు:ఖల నుండి విముక్తి
5. భాద్రపద శుద్ధ ఏకాదశి: పరివర్తన ఏకాదశి: అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తి అగును.
6. భాద్రపద బహుళ ఏకాదశి. ఇంద్ర ఏకాదశి: ఇంద్ర భోగములు సమకూరును
7. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. మహార్జయ ఏకాదశి: సర్వత్రా విజయం;
8. ఆశ్వయుజ బహుళ ఏకాదశి: రామైకదసి: ఎంచుకున్న రంగంలో విజయం;
9. కార్తీక శుద్ధ ఏకాదశి: ఉత్థాన ఏకాదశి: ఈరోజు చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుంది.
10. కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం .
11. మార్గశిర శుద్ధ ఏకాదశి: ఉత్తమైకాదశి: ( ధ్రువ ఏకాదశి) తృప్తి, స్థిర చిత్తం; కలుగుతాయి.
12. మార్గశిర బహుళ ఏకాదశి: సఫలైకాదసి అనూహ్య ఫల ఏకాదశి ): జీవిత గమనాన్ని మార్చివేసే ఉపకారం జరుగుతుంది.
13. పుష్య శుద్ద ఏకాదశి: మోక్షన్య ఏకాదశి: వైకుంఠ మోక్షం, విష్ణు సాయుజ్యం.
14. పుష్య బహుళ ఏకాదశి: షట్ తిలైకదసి: శని దోషాలు హరించును.
15. మాఘ శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి: }
16. మాఘ బహుళ ఏకాదశి: విజయ ఏకాదశి } సర్వత్రా విజయం.
17. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి: పతితోద్ధారణం
18. ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాప విమోచన ఏకాదశి: పాప సంహారము.
19. చైత్ర శుద్ధ ఏకాదశి: కామదా ఏకాదశి: అభిష్ట సిద్ది:
20. చైత్ర బహుళ ఏకాదశి: వరూధిని ఏకాదశి: గో సహస్ర దాన ఫలం
21. వైశాఖ శుద్ధ ఏకాదశి: మోహిని ఏకాదశి: వశీకరణ శక్తి
22. వైశాఖ బహుళ ఏకాదశి: అపర ఏకాదశి: తీర్థ యాత్రా ఫలం
23. జ్యేష్ట శుద్ధ ఏకాదశి: నిర్మల ఏకాదశి: }
24. జ్యేష్ట బహుళ ఏకాదశి: యోగిన్యేకదశి: } సర్వరోగ హరణం..

ఇవి సంవత్సరలో వచ్చే ఏకాదశులు
మోహిని ఏకాదశి
           వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది. ఒకసారి పాండవాగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. “ఓ జనార్ధనా! వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పధ్ధతి ఏమిటి? దానిని ఆచరించడం వలన కలిగే ఫలితాలు ఏమిటి?'' 

                దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజుతో ఇలా అన్నాడు "ఓ ధర్మనందనా ! వశిష్ఠుడు శ్రీరాముడిని తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను. సావధానంగా విను'' అని చెప్పాడు. ఒకసారి శ్రీరాముడు జనక పుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమత పాపదుఃఖ వినాశకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్టుడిని అడిగాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు "రామచంద్రా! నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకర నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై, పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు.
              అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను. శ్రీరామా! వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఏంటో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలు అవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెపుతాను విను'' అని అననదు.
              పవిత్ర సరస్వతీ నదీతీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్ర వంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణుభక్తుడు కూడా ఉండేవాడు. వైశ్యవర్నానికియా చెందినా ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణుమందిరాలను, వైద్యశాలలను, విశాలమైన రహదారులను నిర్మింప చేశాడు. 

            మంచినీటి బావులను త్రవ్వించాడు, ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు. ఈ విధంగా తనకు దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగ పరచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, ధృష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో ధృష్టబుద్ధి పరమపాపి, కుమతి, చెడుప్రవర్తన కలిగినవాడు ఆయిన ధృష్టబుద్ధి వేశ్యాసాంగత్యం కలిగినవాడై, మద్యపానం పట్ల మక్కువ చూపేవాడు. 

           ఇతా ప్రాణులను చంపడంలో, హింసించడంలో అతనికి ఆనందం కలిగేది. కులకళంకంగా తయారైన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. పాపాత్ముడైన ధృష్టబుద్ధి తండ్రి ధనాన్ని దుర్వినిఒగం చేసేవాడు. ఒకసారి అతడు రహదారిలో ఒక వేశ్య భుజంపై చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతనిని ఇంటినుండి తరిమివేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీథిలో పడిన ధృష్టబుద్ధి తనకు ఉన్న వస్త్రాలను ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తన పాపకర్మలను కొనసాగించాడు. 

            ఆ ధనం కూడా ఖర్చు అవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి. తగినంత ఆహారం లభించక అతడు బక్కచిక్కిపోయాడు. చింతాగ్రస్తుడైన ధృష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షకభటులకు చిక్కినా అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతనిని వదిలివేసేవారు. కాని ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశబహిష్కరణకు గురి అయిన ధృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలిదప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్నే తినసాగాడు. 

          ఆ విధంగా విల్లంబులు పట్టుకొని ప్రానహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా ఆదవిఒ సంచరిస్తూ ఒకరోజు ధృష్టబుద్ధి కౌండిన్యఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖ మాసం, ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషివస్త్రం నుండి ఒక నీటిచుక్క ధృష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపలు నశించాయి.

           వెంటనే పరివర్తన కలిగిన ధృష్టబుద్ధి ముకుళితహస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. “నీ పాపాలు అన్నీ కూడా శ్రీఘ్రంగా నశించే ఉదాత్తమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరుపర్వతం అంత పాపరాశిని అయినా నశింపచేయగలుగుతుంది.
          కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు'' అని తెలిపాడు. కౌండిన్యఋషి చెప్పిన మాటలను విన్న ధృష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తిశ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రతఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానం, దానం, యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు అని తెలిపాడు.  

           మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖసంతోషాలు కలుగుతాయి.
మీ
వేద, శాస్త్ర,స్మార్త,పురోహిత పరిషత్తు
శాంతి నగర్,ఖాదీ కాలని,తిరుపతి

No comments:

Post a Comment